గణపతికి ''ఏక దంతుడు'' అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా?

ఓసారి పార్వతీ పరమేశ్వరుల దర్శనం కోసం పరశురాముడు కైలాసానికి వచ్చాడు. అతను నేరుగా లోపలికి వెళ్లబోతుండగా అక్కడ వినాయకుడు అడ్డుకున్నాడు. తన తల్లిదండ్రుల అనుమతి తీసుకుని వచ్చిన తరువాతనే లోపలికి పంపిస్తానని

Webdunia
మంగళవారం, 21 ఆగస్టు 2018 (11:39 IST)
ఓసారి పార్వతీపరమేశ్వరుల దర్శనం కోసం పరశురాముడు కైలాసానికి వచ్చాడు. అతను నేరుగా లోపలికి వెళ్లబోతుండగా అక్కడ వినాయకుడు అడ్డుకున్నాడు. తన తల్లిదండ్రుల అనుమతి తీసుకుని వచ్చిన తరువాతనే లోపలికి పంపిస్తానని చెప్పాడు. పరశురామునికి వినాయకుని ధోరణ ఆగ్రహాన్ని కలిగిస్తుంది. అప్పుడు పరశురాముడు ఇలా అంటారు.
 
పార్వతీ పరమేశ్వరులకు నేను కూడా పుత్రుడినేనని, నా తల్లిదండ్రుల దర్శననానికి అనుమతి అవసరం లేదని పరశురాముడు లోపలికి వెళ్లబోతాడు. వినాయకుడు ఎంతగా చెప్పిన వినిపించుకోకపోవడంతో తన తొండంతో పరశురాముని గట్టిగా చుట్టేసి గిరగిరా తిప్పుతూ సప్త సముద్రాల్లో ముంచేసి మళ్లీ కైలాసానికి తీసుకొస్తాడు.
 
ఆ తరువాత పరశురాముడు ఆగ్రహంతో తన చేతిలోని గొడ్డలిని గణపతిపై విసురుతాడు. దాంతో గణపతికి దంతం విరిగిపోతుంది. అంతలో పార్వతీపరమేశ్వరులు బయటకి వస్తారు. అదే సమయంలో విష్ణుమూర్తి కూడా అక్కడికి వస్తాడు. గణపతి గాయం చూసి పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు విష్ణుమూర్తి పార్వతిని బాధపడొద్దనీ చెప్పి, ఇక గణపతి ఏకదంతుడు అనే పేరుతో పిలువబడుతాడని సెలవిస్తాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరులో బోయ్స్ వేషంలో వచ్చి ఇళ్లను దోచుకుంటున్న గర్ల్స్

'కరీంనగర్ పిల్లా 143' పేరుతో భార్యాభర్తల గలీజ్ దందా ... ఎక్కడ?

దుబాయ్‌లో జనవరి 2026 శ్రేణి కచేరీలు, ఎవరెవరు వస్తున్నారు?

దేశంలో పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్

ఇద్దరు వివాహితలతో అక్రమ సంబంధం, కూడబలుక్కుని ప్రియుడిని చంపేసారు, ఎందుకు?

అన్నీ చూడండి

లేటెస్ట్

15-01-2026 గురువారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

చిన్నారులకు భోగిపళ్లు పోసేటపుడు ఈ ఒక్క శ్లోకం చెప్పండి చాలు

14-01-2026 బుధవారం ఫలితాలు- లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం

సంక్రాంతి పండుగ రోజున పితృదేవతలకు పూజ చేస్తే.. గురువారం రావడం?

భోగి పండుగ 2026.. బలి చక్రవర్తికి ఆహ్వానం.. ఇలాంటి రోజు 2040 వరకు రాదు..

తర్వాతి కథనం
Show comments