Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి హుండీకి తాళం వేయలేదు...? తితిదే ఉద్యోగస్తులే ఇంటి దొంగలా...?

తిరుమల శ్రీవారిని ప్రతిరోజు వేలాదిమంది దర్శించుకుంటుంటారు. స్వామివారికి మ్రొక్కులు కూడా హుండీ ద్వారా తీర్చుకుంటారు. 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయల వరకు శ్రీవారికి హుండీ ఆదాయం వస్తుంది. అలాంటి హుండీకే కన

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (12:01 IST)
తిరుమల శ్రీవారిని ప్రతిరోజు వేలాదిమంది దర్శించుకుంటుంటారు. స్వామివారికి మ్రొక్కులు కూడా హుండీ ద్వారా తీర్చుకుంటారు. 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయల వరకు శ్రీవారికి హుండీ ఆదాయం వస్తుంది. అలాంటి హుండీకే కన్నం వేయాలని తితిదే అధికారులు భావించారేమో.. ఏకంగా హుండీకి తాళం వేయడం మరిచిపోయారు. హుండీ నిండిపోయి డబ్బులన్నీ కిందపడిపోయాయి. వీటిని తితిదే ఉద్యోగస్తులే తీసుకుని వెళ్లిపోయారన్న ఆరోపణలు లేకపోలేదు.
 
ఆగష్టు 29వ తేదీ తితిదే ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి తిరుమల శ్రీవారి ఆలయంలో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో హుండీకి సీలు వేయకపోవడాన్ని గమనించి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. దీనిపై అప్పట్లో పెనుదుమారమే రేపింది.
 
ఆరోజు ఉదయం 10.30 నుంచి 11గంటల సమయంలో ఛైర్మన్‌ ఆలయం లోపలికి వచ్చారు. సన్నిధికి చేరుకున్నారు. అంతకుముందే సిబ్బంది. నిండిన హుండీ తీసుకొచ్చి సన్నిధిలో పెట్టారు. నేరుగా హుండీ వద్దకు వెళ్ళిన ఆయన హుండీకి సీలు వేయకపోవడాన్ని గమనించారు. అంతే ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అది పవిత్రమనే ఆలయమనే సంగతి కూడా మరిచిపోయి సంయమనం కోల్పోయి బూతులు తిట్టారట. హుండీలో డబ్బులంతా ఎత్తుకుని పోతా ఉండారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట.
 
తితిదే ఛైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగానే తితిదే ఉద్యోగుల తీరు కూడా ఉంది. నిజంగానే హుండీకి తాళం వేయకుండా, హుండీ నిండిపోయి డబ్బులు కిందపడిపోతున్నా తితిదే ఉద్యోగస్తుల్లో చలనం లేదు. అంతేకాదు హుండీలో డబ్బులు వేసే సమయంలో భక్తులకే డబ్బులు చేతులు తగులుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. డబ్బు నిండిపోయింది.. హుండీ మార్చండి అంటూ భక్తులు చెప్పినా పట్టించుకోకపోగా తాళాలు వేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. తాళం వేయకపోవడంపై తితిదే ఛైర్మన్‌ సీరియస్‌గా తీసుకుని విజిలెన్స్ విచారణకు ఆదేశించారట. మొత్తం మీద శ్రీవారి హుండీకే తితిదే ఉద్యోగులు కన్నం వేయడానికి ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

లేటెస్ట్

బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

17-05-2025 శనివారం దినఫలితాలు - చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తధ్యం...

NRI Donor: రూ.1.40కోట్లకు పైగా విరాళం ఇచ్చిన ఎన్నారై దాత

16-05-2025 శుక్రవారం దినఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు...

Govinda: మీ వయస్సు 25 ఏళ్ల కంటే తక్కువా? ఐతే శ్రీవారి వీఐపీ దర్శనం ఖాయం.. ఎలా?

తర్వాతి కథనం
Show comments