Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల వెంకన్న మహిమే మహిమ..

Webdunia
శుక్రవారం, 5 డిశెంబరు 2014 (17:20 IST)
భక్తుల బాధలను నెరవేర్చడం కోసమే వేంకటేశ్వరుడు తిరుమల కొండలను మరో వైకుంఠంగా తీర్చిదిద్దుకున్నాడు. తన దర్శనం కోసం రావాలని భక్తులు సంకల్పించుకున్న క్షణం నుంచి, తన దర్శనం అనంతరం తిరిగి వాళ్లు తమ నివాసానికి చేరుకునేంత వరకూ ఆయన బాధ్యత వహిస్తుంటాడని అంటారు.
 
సాక్షాత్తు అక్కడ కొలువైంది ప్రత్యక్ష నారాయణుడే కనుక, ఎన్ని కష్టాలు ఎదురైనా లెక్కచేయక భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అలా ఓ భక్తుని సంకల్పంచే  నిర్మించబడిన వేంకటేశ్వరస్వామి ఆలయం ఖమ్మంలో కనిపిస్తుంది. 
 
ఖమ్మం - కాలువ గట్టు సమీపంలో గల ఈ ఆలయంలో శ్రీదేవి - భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి దర్శనమిస్తూ ఉంటాడు. గర్భాలయంలో స్వామివారి ధృవమూర్తి కళకళలాడుతూ కనిపిస్తుంది. గర్భాలయానికి రెండువైపులా గల ప్రత్యేక మందిరాల్లో అమ్మవార్లు కొలువై ఉంటారు.
 
చాలాకాలం క్రితం నిర్మించబడిన ఆలయం కావడం వలన, ఇక్కడి స్వామివారి మహిమలు అనుభవంలోకి రావడం వలన భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ప్రతి శనివారం, పర్వదినాల్లోను, ధనుర్మాసంలోను ప్రత్యేక పూజలు, అలంకారాలు  సేవలు జరుగుతుంటాయి. ఇక్కడి స్వామివారిని దర్శించుకుని బాధలు చెప్పుకుంటే అవి మాయమైపోతాయని ఆలయ నిర్వాహకులు అంటున్నారు. 

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

Show comments