Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పిన అనంత పద్మనాభ వత్రం గురించి తెలుసా?

Webdunia
సోమవారం, 14 డిశెంబరు 2015 (19:07 IST)
పాండవులు వనవాస సమయంలో తాము ఎదుర్కొంటున్న కష్టాల్ని ఎదుర్కుంటున్నప్పటికీ తమ బాధలు తీరే మార్గాన్ని సూచించాల్సిందిగా.. పాండవుల్లో ఒకరైన ధర్మరాజు శ్రీకృష్ణుడుని కోరతాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు.. అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరించాల్సిందిగా సెలవిస్తాడు. ఈ వ్రత మహాత్మ్యాన్ని గురించి వివరిస్తాడు. వ్రతాలలో విశిష్టమైన వ్రతంగా చెప్పబడే అనంతపద్మనాభ వ్రతాన్ని దేవతలు, మహర్షులు ఆచరించినట్లు పురాణాలు చెప్తున్నాయి. 
 
అనేక రూపాలు, పేర్లు కలిగి అనంతమైన కాలానికి ప్రతీక అయిన తనని (శ్రీకృష్ణుడిని) ఆదిశేషుడి రూపంలో ఆరాధించమని చెబుతాడు. ఒక కలశంలోకి జలాన్ని తీసుకుని అందులోకి యమునను ఆవాహన చేసి .. ఏడు పడగలతో ఆదిశేషుడి రూపాన్ని దర్భాలతో తయారుచేసుకుని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించాలి.
 
చేతికి 14 ముడులు గల తోరమును ధరించి, 14 రకాల పండ్లు, ఇష్టమైన 14 రకాల పదార్థాలను స్వామిని నివేదన ఇవ్వాలి. ఇలా ఈ వ్రతాన్ని 14 సంవత్సరాల పాటు ఆచరించి.. ఆ తరువాత ఉద్యాపన చేయడం నియమంగా కనిపిస్తుంది. ఈ తోరము ఒక రక్షా కంకణంలా కాపాడుతూ ఉంటుందనీ. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఈతిబాధలు, కష్టాలు తొలగిపోయి, సుఖశాంతులు కలుగుతాయని పండితులు అంటున్నారు. 

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

Show comments