బాబా... నావద్ద ఒక్క పైసా కూడా లేదు....

సాయిబాబా దగ్గర ప్రొఫెసర్ నార్కే అనే ఓ భక్తుడు ఉండేవారు. ఆయన యోగ శాస్త్రాన్ని అభ్యసిస్తూ వుండేవారు. ఒకసారి ప్రొఫెసర్ నార్కే యోగ వాశిష్ట గ్రంథాన్ని చదువుతున్నారు. సాధకుడిని భగవంతుడితో అనుసంధానం చేసే అపురూప గ్రంథం అది. అందులో కొన్ని అధ్యాయాలు చాలా రహస్య

Webdunia
బుధవారం, 3 మే 2017 (20:39 IST)
సాయిబాబా దగ్గర ప్రొఫెసర్ నార్కే అనే ఓ భక్తుడు ఉండేవారు. ఆయన యోగ శాస్త్రాన్ని అభ్యసిస్తూ వుండేవారు. ఒకసారి ప్రొఫెసర్ నార్కే యోగ వాశిష్ట గ్రంథాన్ని చదువుతున్నారు. సాధకుడిని భగవంతుడితో అనుసంధానం చేసే అపురూప గ్రంథం అది. అందులో కొన్ని అధ్యాయాలు చాలా రహస్యమైనవి. వాటి గురించి ఒకసారి బాబా నార్కేకు వివరించి... నువ్వు నాకు 15 రూపాయలు గురుదక్షిణ ఇవ్వాలి అని అన్నారు. ఆ సమయంలో నార్కే వద్ద డబ్బు లేదు. 
 
దాంతో ఆయన... బాబా, నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. అది మీకు తెలుసు. అయినా నన్ను మీరు గురుదక్షిణ అడగటంలో ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. అప్పుడు బాబా నవ్వుతూ... నువ్వు యోగ వాశిష్టలో కొన్ని అధ్యాయాలు తెలుసుకున్నావు. వాటి నుంచి 15 రూపాయలు నాకు ఇవ్వు అన్నారు. నార్కేకు విషయం బోధపడింది. 
 
యోగా వాశిష్టంలో ఉన్నతమైన యోగాకి వుండాల్సిన 15 లక్షణాలను వివరించడం జరిగింది. ఆ లక్షణాలను తనను ఆచరించమంటున్నారని అర్థం చేసుకున్న నార్కే... వాటిని పాటించి తనను తాను బాబాకు అర్పించుకున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓటమి అంచున ఉన్నవారు షరతులు విధించలేరు : ట్రంప్ కాల్పుల విమరణ పొడగింపుపై ఇరాన్ కామెంట్స్

హోమ్ స్టేలో బస చేసిన మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం.. ఇద్దరి అరెస్టు

సింగపూర్‌లో ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం... హోం మంత్రితో భేటీ

మంత్రి నాదెండ్ల మనోహర్‌కు పితృవియోగం - మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు మృతి

స్థానిక కోటాను 95శాతానికి పెంచిన ఆంధ్రప్రదేశ్

అన్నీ చూడండి

లేటెస్ట్

19-04-2026 ఆదివారం ఫలితాలు : ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కుంటారు...

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజున అద్భుత కలయిక.. ఉప్పు, గవ్వలతో ఇలా చేస్తే?

Simhadri Appanna: అక్షయ తృతీయ నాడే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం.. చందనోత్సవం

Parashurama Jayanti 2026: ప్రదోష కాలంలో జన్మించిన పరశురాముడు.. పూజ ఇలా చేస్తే?

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజున శని, రాహు దోషాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి..?

తర్వాతి కథనం
Show comments