Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీలి రంగు పువ్వులతో "శనివ్రతం" చేయండి!

Webdunia
మంగళవారం, 12 ఆగస్టు 2014 (17:35 IST)
శనివారం రోజున శనివ్రతం ఆచరించే వారికి ఈతిబాధలు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని వేదపండితులు చెపుతుంటారు. అష్టమి వ్రతాల్లో ప్రసిద్ధి చెందిన శనివత్రాన్ని ఆచరించడం చాలా సులభం. శనివారం సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించాలి. 
 
పూజగదిని, పటాలను శుభ్రం చేసుకుని పసుపుకుంకుమ, పువ్వులతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత పూజ ప్రారంభించే ముందు విఘ్నేశ్వరుని స్తుతించాలి. తర్వాత పూవులు, అక్షింతలతో శివపార్వతుల విగ్రహానికో లేదా, పటానికో అర్పించి, శివాష్టోత్తరం, గౌరీ లేదా ఉమాష్టోత్తరం చదువుతూ పూజ చేస్తే పుణ్య ఫలాలు సిద్ధిస్తాయి. 
 
శుద్ధాష్టమి, శనివారం, కృత్తికా నక్షత్రం చేయదగ్గ ఈ వ్రతానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని పండితులు అంటున్నారు. శనీశ్వరుని శాంతి అనుగ్రహమే కాకుండా, కృత్తికా నక్షత్రాధిపతి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా పొందవచ్చునని వారు చెబుతున్నారు. ఇకపోతే... శనివారం ఆచరించే ఈ శనివ్రతం చివరిన, నీలం రంగు పువ్వులతో శనీశ్వరాష్టోత్తరం స్తుతించడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం. 

జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం ఉలిక్కిపడుతుంది: వైఎస్ జగన్

డిబిటి పథకాల కింద నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్

గృహనిర్భంధంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు

41 మందులపై ధరలను తగ్గించిన ప్రభుత్వం

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

10-05-2024 శుక్రవారం దినఫలాలు - సంఘంలో మీ గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి...

అక్షయ తృతీయ.. లక్ష్మీదేవిని పెళ్లిచేసుకున్న రోజు ఇదే..

Show comments