స్త్రీలు నిశ్చింతగా ''సుందరకాండ'' పారాయణం చేయొచ్చట!

Webdunia
శుక్రవారం, 31 అక్టోబరు 2014 (17:26 IST)
స్త్రీలు 'సుందరకాండ' పారాయణం చేయకూడదని అపోహలున్నాయి.  హనుమంతుడు బ్రహ్మచారి  కాబట్టి.. ఆయన స్త్రీలకు దూరంగా ఉంటాడు కాబట్టి ... నియమనిష్టల్లో తేడా వస్తే ఆగ్రహిస్తాడనే కారణాలను నమ్మిన వారు నిజంగానే సుందరకాండ పారాయణానికి దూరమవుతూ వస్తున్నారు. నిజానికి ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే. 
 
స్త్రీలు శుచిగా వున్నప్పుడు సుందరకాండ పారాయణం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. వాల్మీకి మహర్షి రచించిన 'శ్రీ మద్రామాయణం' రమణీయమైన దృశ్య కావ్యం. అలాంటి రామాయణానికే అందాన్ని తీసుకు వచ్చినది 'సుందరకాండ'. 
 
ఇది స్త్రీలు పారాయణం చేయకూడనిదైతే అసలు రామాయణ కావ్యానికి వాల్మీకి 'సీతా యా శ్చరితం మహత్' (గొప్పదైన సీత కథ) అనే పేరు పెట్టేవాడు కాదని పండిత ప్రముఖులు అంటున్నారు. 
 
కనుక ఈ విషయంలో స్త్రీలు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా నిశ్చింతగా 'సుందరకాండ' పారాయణం చేసుకోవచ్చు. ఆయురారోగ్యాలను ప్రసాదించే ఆ స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

బిడ్డల కళ్లెందుటే కన్నతల్లి మృతి.. ఎలా? ఎక్కడ? (వీడియో)

యుద్ధంలో భారత్‌ను ఓడించలేని పాకిస్తాన్ ఉగ్రదాడులకు కుట్ర : దేవేంద్ర ఫడ్నవిస్

మెట్రో రైల్ ఆలస్యమైనా ప్రయాణికులపై చార్జీల బాదుడు... ఎక్కడ?

హెటెన్షన్ విద్యుత్ వైరు తగలడంతో క్షణాల్లో దగ్ధమైపోయిన బస్సు

అన్నీ చూడండి

లేటెస్ట్

Love: ప్రేమిస్తే ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిల్నే ప్రేమించాలి.. ఎందుకంటే?

20-11-2025 గురువారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...

శబరిమల మార్గంలో నెట్‌వర్క్‌ను మెరుగుపరిచిన Vi ; పిల్లల భద్రతకు అనువైన వి సురక్ష రిస్ట్ బ్యాండ్

Vaikunta Darshan: ఆన్‌లైన్‌లోనే వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ

19-11-2025 బుధవారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...

Show comments