Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతి రోజున విష్ణుసహస్రనామ పఠనం.. పితృదేవతలకు పూజ తప్పనిసరి!

Webdunia
బుధవారం, 13 జనవరి 2016 (15:23 IST)
సంక్రాంతి పండుగ రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి విష్ణు సహస్రనామ పఠనం చేసే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. సంక్రాంతి రోజున విష్ణుసహస్ర నామాన్ని జపించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే పుణ్య ఘడియల్లో ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. 
 
సంక్రాంతి రోజున చేసే స్నానాలు, దానాలు, జపాలు, వ్రతాలు విశేష ఫలితాలను ఇస్తాయి. అలాగే సంక్రాంతి రోజు గుమ్మడి, వస్త్రములు దానం చేయడం ఆచారం. ఇంకా పితృదేవతలను ఉద్దేశించి తర్పణాలు, దానాలు చేయడం ఉత్తమం. సంక్రాంతి రోజు స్నానం చేయని వారికి రోగాదులు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. సంక్రాంతి రోజు దేవతలకు, పితృదేవతలకు, పాత్రులకు ఏ ఏ దానాలు చేస్తామో అవి జన్మజన్మలకి పుణ్యఫలితాలను ఇస్తాయని పండితులు చెప్తున్నారు.
 
ఈ పుణ్య కాలంలో తిలలు, బియ్యం కలిపి శివారాధన చేయడం, ఆవు నేతితో అభిషేకం చేయడం, నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా శ్రేష్ఠమైనది. నల్ల నువ్వులతో పితృతర్పణాలు ముఖ్యంగా ఆచరించవలసిన విధి. వీటిని సంక్రాంతి రోజున మరువకూడదని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు.

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

Show comments