మహాశివరాత్రి ఉపవాసం వుంటే.. ఇవి తినకూడదట..

Webdunia
బుధవారం, 10 మార్చి 2021 (12:04 IST)
మహాశివరాత్రి రోజున ఉపవాసం, జాగారం తప్పనిసరి. శివరాత్రికి ముందు రోజు ఒకవేళ భోజనం చేసి.. సుఖభోగాలకు దూరంగా వుండాలి. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందు నిద్రలేచి.. శుచిగా స్నానమాచరించి.. సూర్య నమస్కారం చేయాలి. శివపూజ చేయాలి. ఆపై ఆలయాల్లో శివ దర్శనం చేసుకోవాలి. ధ్వజస్తంభం లేని ఆలయంలో సాష్టాంగ నమస్కరించకూడదు.
 
మహాశివరాత్రి రోజున శివకథలు వింటూ జాగరణ చేయాలి. అలాగే రథరాత్రి మూడు, నాలుగో జాములో మరోసారి ఆహుతులను సమర్పించాలి. తెల్లవారున శివ భక్తులకు అన్న వస్త్రాలు, ఛత్రం ధానం చేయాలి. ఇంటి దగ్గరే శివపార్వతులను పుష్పాలు, బిల్వదళాలు, పంచామృతాలతో అభిషేకం చేయాలి. వీలైతే ఆలయాల్లో జరిగే పూజల్లో పాలు పంచుకోవచ్చు.
 
మహా శివరాత్రి రోజున ప్రాతఃకాలాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవాలి. సూర్యోదయం వరకూ మౌనవ్రతం చేయదలచినవారు ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి. వ్రతం పాటిస్తే గనక శివరాత్రి రోజున వరి అన్నం, గోధుమలు, పప్పులు వంటివి తినకూడదు. వాటి బదులు పండ్లు, పాలు వాడాలి. చాలా మంది భక్తులు రాత్రంతా పూజ చేస్తారు. ఎంత నిష్టగా చేస్తే అంత మంచి ఫలం దక్కుతుందని ప్రతీతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: కాకినాడ సెజ్ రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పవన్

గూగుల్ కమ్స్ టు ఏపీ : సీఎం చంద్రబాబు పోస్ట్

Google To AP: విశాఖలో గూగుల్ 1-జీడబ్ల్యూ డేటా సెంటర్‌.. ఆ ఘనత బాబు, లోకేష్‌ది కాదా?

ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ ఇక్కట్లు.. చంద్రబాబు సర్కారు ఆ సమస్యను పరిష్కరిస్తుందా?

రాజకీయాల్లోకి వచ్చాక ఆదాయం తగ్గిపోయింది .. ఖర్చులు పెరిగాయి : కంగనా రనౌత్

అన్నీ చూడండి

లేటెస్ట్

12-10-2025 శనివారం ఫలితాలు- తొందరపాటు నిర్ణయాలు తగవు

దీపావళి రోజున దీపం మంత్రం, మహాలక్ష్మి మంత్రం

12-10-2025 నుంచి 18-10-2025 వరకు ఫలితాలు-జాతక పొంతన...

Mysore Pak Recipe: దీపావళి వంటకాలు.. మైసూర్ పాక్ చేసేద్దాం

సమ్మక్క సారలమ్మ మహా జాతర.. హుండీలో డబ్బులు వేయాలంటే క్యూ ఆర్ కోడ్

తర్వాతి కథనం
Show comments