Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాశివరాత్రి ఉపవాసం వుంటే.. ఇవి తినకూడదట..

Webdunia
బుధవారం, 10 మార్చి 2021 (12:04 IST)
మహాశివరాత్రి రోజున ఉపవాసం, జాగారం తప్పనిసరి. శివరాత్రికి ముందు రోజు ఒకవేళ భోజనం చేసి.. సుఖభోగాలకు దూరంగా వుండాలి. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందు నిద్రలేచి.. శుచిగా స్నానమాచరించి.. సూర్య నమస్కారం చేయాలి. శివపూజ చేయాలి. ఆపై ఆలయాల్లో శివ దర్శనం చేసుకోవాలి. ధ్వజస్తంభం లేని ఆలయంలో సాష్టాంగ నమస్కరించకూడదు.
 
మహాశివరాత్రి రోజున శివకథలు వింటూ జాగరణ చేయాలి. అలాగే రథరాత్రి మూడు, నాలుగో జాములో మరోసారి ఆహుతులను సమర్పించాలి. తెల్లవారున శివ భక్తులకు అన్న వస్త్రాలు, ఛత్రం ధానం చేయాలి. ఇంటి దగ్గరే శివపార్వతులను పుష్పాలు, బిల్వదళాలు, పంచామృతాలతో అభిషేకం చేయాలి. వీలైతే ఆలయాల్లో జరిగే పూజల్లో పాలు పంచుకోవచ్చు.
 
మహా శివరాత్రి రోజున ప్రాతఃకాలాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవాలి. సూర్యోదయం వరకూ మౌనవ్రతం చేయదలచినవారు ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి. వ్రతం పాటిస్తే గనక శివరాత్రి రోజున వరి అన్నం, గోధుమలు, పప్పులు వంటివి తినకూడదు. వాటి బదులు పండ్లు, పాలు వాడాలి. చాలా మంది భక్తులు రాత్రంతా పూజ చేస్తారు. ఎంత నిష్టగా చేస్తే అంత మంచి ఫలం దక్కుతుందని ప్రతీతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Anantapur: గొంతులో చిక్కుకున్న దోసె ముక్క.. బాలుడు మృతి.. ఎక్కడ?

భర్తకు స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇచ్చింది.. ఆపై కరెంట్ షాక్ కూడా.. బావతో కలిసి చంపేసింది..

తిరుపతిలో ఘోరం.. అనుమానం.. భార్య గొంతుకోసి చంపేసి.. ఆపై భర్త ఏం చేశాడంటే?

బర్త్ డే మరుసటి రోజే మూడేళ్ల బాలుడు మృతి.. వీధికుక్కలు పొట్టనబెట్టుకున్నాయ్!

Bonalu: మహంకాళి బోనాల జాతర- రెండు రోజుల పాటు స్కూల్స్, వైన్ షాపులు బంద్

అన్నీ చూడండి

లేటెస్ట్

కాలాష్టమి 2025: మినపప్పుతో చేసిన గారెలు.. పెరుగు అన్నం ఆహారం

17-07-2025 గురువారం దినఫలితాలు - ఆప్తులను విందులు - వేడుకలకు ఆహ్వానిస్తారు...

16-07- 2025 బుధవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు...

శ్రీవారి దర్శనం - అక్టోబరు కోటా టిక్కెట్లు ఎపుడు రిలీజ్ చేస్తారు?

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

తర్వాతి కథనం
Show comments