Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీనివాసునికి ఇద్దరు రక్షక భటులు... ఎవరువారు.. ఎక్కడ ఉంటారు?

కలియుగ వైకుంఠుడు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి లీలలు అన్నీ ఇన్నీ కావు. తిరుమల గిరులలోని ప్రతి ప్రాంతం ఎంతో ప్రాశస్త్యమైనదే. అలాగే తిరుమల ఆలయంలోని ప్రతి విగ్రహానికి ఎంతో చరిత్ర ఉంది.

Webdunia
గురువారం, 28 జులై 2016 (15:31 IST)
కలియుగ వైకుంఠుడు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి లీలలు అన్నీ ఇన్నీ కావు. తిరుమల గిరులలోని ప్రతి ప్రాంతం ఎంతో ప్రాశస్త్యమైనదే. అలాగే తిరుమల ఆలయంలోని ప్రతి విగ్రహానికి ఎంతో చరిత్ర ఉంది. స్వామివారి దర్శనానికి భక్తులు వెళ్లేటప్పుడు శ్రీవారికి ముందు ఇద్దరు రక్షకభటుల్లా కనిపిస్తారు. వారే జయ, విజయలు. జయ, విజయలంటే స్త్రీలు అనుకునేరు. కాదండోయ్‌.. వీరిద్దరూ పురుషులే. జయుడు.. విజయుడు. అసలు ఈ జయవిజయలు ఎవరు.. వీరెందుకు శ్రీవారి ముందు నిలబడి ఉంటారో తెలుసుకుందాం..
 
ప్రపంచ నలుమూలల నుంచి తిరుమలకు భక్తులు వస్తూ, పోతూ ఉంటారు. వచ్చిన భక్తులు ధూళితో వస్తుంటారనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే భక్తులు స్నానం చేయకుండానో.. లేకుంటే మహిళల్లో రకరకాల సమస్యలతో స్వామి దర్శనానికి వస్తుంటారు. దీన్నే ధూళి అంటారు. ఇలాంటి ధూళితో భక్తులు రాకుండా పుణ్యస్నానాలు ఆచరించి రావాలని జయ, విజయులు చెబుతుంటారు.
 
జయ, విజయలు స్వామి వారి ముందు ఉంటారు. జయుడు కుడిచేతి చూపుడు వేలుతో హెచ్చరిస్తుంటాడు, విజయుడు ఎడమచేతి చూపుడు వేలు చూపిస్తుంటాడు. అంటే భక్తులు శుద్ధంగా ఉన్నారా అని ప్రశ్నిస్తుంటారు. అంతేకాదు మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా స్వామివారిని దర్శించుకోవాలని కూడా వీరు చేతివేళ్ళ ద్వారా చెబుతుంటారు. వీరినే ద్వారపాలకులు అంటారు. 
 
తిరుమహామణి మండపంలో బంగారువాకిలికి ఉభయ పార్స్వాలలో నిలిచి ఉండి శంఖ, చక్ర గదాధారులై, ద్వారపాలకులై జయ, విజయులు ఉన్నారు. పంచలోహ మూర్తుల ఎత్తు 10 అడుగుల పై మాటే. ఈ విగ్రహమూర్తుల చుట్టూ కర్రతో నిర్మింపబడి కటాంజనం ఏర్పాటు చెయ్యబడింది. బంగారు వాకిళ్ళతో పాటు, ఈ జయవిజయుల కటాంజనాలకు కూడా బంగారు పూత పూయబడిన రేకులు తాపపడి ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో ఎక్కడా కానరాని స్థిర ప్రతిష్ట చేయబడిన ఇంత ఎతైన పంచలోహ సుందరమూర్తులు ఎప్పుడు ప్రతిష్టించబడ్డారో పురాణాలే చెప్పలేకున్నాయి. 
 
అహోరాత్రాలు శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిని ఏమరపాటు లేకుండా కపలా కాస్తున్నారు వీరద్దరు. గోవిందా..గోవిందా..! 

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

అక్షయ తృతీయ 2024.. తులసి మొక్కను ఇంట్లో నాటిపెడితే?

08-05-202 బుధవారం దినఫలాలు - మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది...

07-05-202 మంగళవారం దినఫలాలు - దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది...

ఆ దిశల్లో బల్లి అరుపు వినిపిస్తే.. ఇక డబ్బే డబ్బు..!

తర్వాతి కథనం
Show comments