Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి పండగ ఎన్ని రోజులు జరుపుకుంటారు?

Webdunia
గురువారం, 4 నవంబరు 2021 (09:11 IST)
ఆశ్వయుజ బహుళ త్రయోదశి (ధన త్రయోదశి) మొదలు కార్తీక శుద్ధ విదియ (ప్రీతి విదియ) వరకు ఐదు రోజులు పండుగ చేస్తారు. ధన త్రయోదశి నాడు తమ వారసులను అనుగ్రహించడానికి పితృదేవతలు కిందికి దిగి వస్తారని, వారికి దారి చూపడానికి ఇంట్లో దక్షిణం వైపు దీపం పెట్టాలని చెబుతారు. దీనిని యమ దీపం అంటారు. 
 
ఈ దీపారాధన చేసిన వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. తల్లిదండ్రులు గతించిన వారు మాత్రమే యమ దీపం పెడుతుంటారు. నరక చతుర్దశి నాడు ఆడపిల్లలు ఇంట్లో వారికి హారతులు ఇవ్వడం సంప్రదాయం. అమావాస్య నాడు లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. సాగర మథనంలో లక్ష్మీదేవి ఇదే రోజు ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. 
 
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని లక్ష్మీదేవి పూజలు చేస్తారు. అమావాస్య మర్నాడు కొన్ని ప్రాంతాల్లో బలి పాడ్యమిగా చేసుకుంటారు. విదియ నాడు యమ ద్వితీయగా చేసుకుంటారు. ఆనాడు అన్నాదమ్ములు తమ అక్కాచెల్లెళ్ల చేతి వంట తినాలనే నియమం ఉంది. ఏడాదికి ఒకసారైనా సోదరి ఇంటికి వెళ్లి ఆమె యోగక్షేమాలు విచారించాలని ఈ పండుగ తెలియజేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Tourism: తక్కువ పెట్టుబడి.. ఉద్యోగాలను సృష్టించగలదు.. ఆర్థిక వృద్ధిని పెంచగలదు.. బాబు

అత్తపై కన్నేసిన కామాంధుడు, కోర్కే తీరేలా చేయంటూ భార్యపై ఒత్తిడి, చివరికి...

Wife: భార్యను గొంతుకోసి చంపేసిన క్యాబ్ డ్రైవర్.. ఆపై లొంగిపోయాడు.. కారణం ఏంటంటే?

తల్లి సాయంతో భర్తను హత్య చేసిన భార్య.. ఎలాగంటే?

Apsara Case: అప్సర హత్య కేసు.. పూజారికి రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు

అన్నీ చూడండి

లేటెస్ట్

23-03-2025 ఆదివారం మీ రాశిఫలాలు : ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

23-03-2025 నుంచి 29-03-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

కాలాష్టమి రోజు కాలభైరవ పూజ.. రాహు, కేతు దోషాల నుంచి విముక్తి

22-03-2025 శనివారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Mobile Wallpaper Vastu: మొబైల్ వాల్‌పేపర్‌ను ఇలా సెట్ చేస్తే దురదృష్టం పట్టుకుంటుందా?

తర్వాతి కథనం
Show comments