Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండు చేయించుకుని తిరుమలలో నకిలీ నోట్లతో దొంగనోట్ల ముఠా....

తిరుపతి, తిరుమలలో నకిలీ దొంగనోట్ల ముఠా ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతిరోజు లక్షల్లో ఈ ముఠా సభ్యులు దొంగనోట్లను తయారుచేసి మార్చేస్తున్నారు. అది కూడా శ్రీవారి భక్తుల ముసుగులో. ఎక్కడో కాదు 24 గంటల పాటు జనసంచారం ఉండే బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌లలోనే ఈ తతంగమ

Webdunia
శనివారం, 18 జూన్ 2016 (19:30 IST)
తిరుపతి, తిరుమలలో నకిలీ దొంగనోట్ల ముఠా ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతిరోజు లక్షల్లో ఈ ముఠా సభ్యులు దొంగనోట్లను తయారుచేసి మార్చేస్తున్నారు. అది కూడా శ్రీవారి భక్తుల ముసుగులో. ఎక్కడో కాదు 24 గంటల పాటు జనసంచారం ఉండే బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌లలోనే ఈ తతంగమంతా సాగుతోంది. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం తమకేమీ సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు. తిరుపతిలో దొంగనోట్ల ముఠాపై ప్రత్యేక కథనం.
 
ప్రతి రోజు 50 నుంచి 70 వేలమంది భక్తులు. ఇంతమంది భక్తులు వచ్చే ప్రాంతం మరెక్కడా లేదు. ప్రపంచంలోనే అది పెద్ద ధార్మిక సంస్థలో తిరుమల ఒకటి. అయితే అలాంటి తిరుమల, తిరుపతిలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోతోంది. కొంతమంది అసాంఘిక వ్యక్తులు ధార్మిక క్షేత్ర ప్రతిష్టను దిగజార్చేస్తున్నారు.
 
బెంగుళూరు, చెన్నైలకు చెందిన కొంతమంది తిరుపతికి చేరుకుని ఈ ప్రాంతంలోనే ముఠా సభ్యులుగా ఏర్పడి దొంగనోట్లను తయారు చేస్తున్నట్లు సమాచారం. పట్టణ నడిబొడ్డునే అపార్టుమెంట్లలో బాడుగ ఉంటూ దొంగనోట్లను తయారుచేస్తున్నట్లు సమాచారం. తయారు చేసిన దొంగనోట్లను భక్తుల ముసుగులో తలనీలాలను సమర్పించి గుండుతోనే తిరుగుతూ వాటిని మార్చేస్తున్నారు. ప్రతిరోజు లక్షల్లోనే దొంగనోట్లను ఈ ముఠా మారుస్తున్నారని తెలుస్తోంది. ఈ ముఠా ఆలయాలనే దొంగనోట్లను మార్చడానికి ఎంచుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. భక్తుల లాగా ఆలయాల వద్దకు వెళ్ళి తమ వద్ద ఉన్న దొంగనోట్లను ఇస్తూ ఈజీగా వాటిని మార్చేస్తున్నారు. ఇవి తెలియని షాపు యజమానులు వాటిని తీసుకుంటున్నారు. అంతేకాదు ఆ దొంగనోట్లనే తిరిగి నిజమైన భక్తులకు ఇస్తున్నారు.
 
ముఠా సభ్యులు 50మందికిపైగా ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరు ప్రతిరోజు ఒక్కొక్కరు 10వేల రూపాయల దొంగనోట్లను మార్చాలన్న నిబంధనను కూడా పెట్టుకున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా అసలు  కన్నా నకిలీ నోట్లే ఎక్కువగా ఉన్నాయని బ్యాంకు అధికారులు గుర్తించారు. వీరు మారుస్తున్న దొంగనోట్లు ఎటిఎంలలో కూడా వస్తున్నాయంటే వీరి చేతివాటం ఏ పాటితో అర్థమవుతుంది. తిరుమలలో కూడా ఈ మధ్యకాలంలో నకిలీ ముఠా సభ్యులు ప్రతిరోజు తిరుగుతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. తితిదేకి సంబంధించిన షాపులతో పాటు, ప్రైవేటు షాపులలో ఈ దొంగనోట్లను మార్పిడి చేస్తున్నట్లు సమాచారం. పోలీసులకు ఇలాంటి సమాచారం అందుతున్నా పట్టనట్లు ఉంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్టులో చిక్కుకున్న బాలుడు.. రక్షించి ఆస్పత్రిలో చేర్చినా ప్రాణాలు పోయాయ్!

ఫైబర్ నెట్ ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు: గౌతమ్ రెడ్డి ధ్వజం

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌పై సజ్జనార్ సీరియస్.. నానికి కితాబ్.. మారకపోతే అంతే సంగతులు

పట్టపగలు.. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా కన్నతండ్రిని పొడిచి చంపేసిన కొడుకు...

Tesla Coming: టెస్లాను ఏపీకి చంద్రబాబు సర్కారు తీసుకువస్తుందా?

అన్నీ చూడండి

లేటెస్ట్

యాదగిరగుట్టలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు ప్రారంభం

Lakshmi Narayan Rajyoga In Pisces: మిథునం, కన్య, మకరరాశి వారికి?

19-02-2025 బుధవారం రాశిఫలాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

Lord Shiva In Dream: కలలో శివుడిని చూస్తే.. ఏం జరుగుతుందో తెలుసా? నటరాజ రూపం కనిపిస్తే?

తమిళనాడులో ఆలయాల స్వయంప్రతిపత్తి ప్రాముఖ్యత: తిరుపతిలో మాట్లాడిన కె. అన్నామలై

తర్వాతి కథనం
Show comments