Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి ముందే తొమ్మిది మంది దారుణ హత్య... హత్య చేసింది ఎవరు!

పూర్వం తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయ అర్చకులు తొమ్మిది మంది. స్వామివారి ఆభరణాలను ధరించారు. అది స్వామివారి దర్శనానికి వచ్చిన విజయనగరరాజు కంటపడింది. దాంతో ఆ రాజుకు ఆగ్రహం ముంచుకొచ్చింది. తొమ్మిది మంది అర్చ

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2016 (12:59 IST)
పూర్వం తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయ అర్చకులు తొమ్మిది మంది. స్వామివారి ఆభరణాలను ధరించారు. అది స్వామివారి దర్శనానికి వచ్చిన విజయనగరరాజు కంటపడింది. దాంతో ఆ రాజుకు ఆగ్రహం ముంచుకొచ్చింది. తొమ్మిది మంది అర్చకులనూ విచక్షణా రహితంగా అక్కడికక్కడే చంపేశాడు. నరహత్య మహాపాపం అనుకుంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా తొమ్మిది మందిని హత్యచేశాడు రాజు. పైగా పవిత్ర దేవాలయంలో హత్య చేశాడు. అది సామాన్య దోషం కాదు. మహాపాపం. ఆ పాప పరిహారం కోసం వ్యాసరాయలు ప్రయత్నించారు. పన్నేండేళ్ళ పాటు భక్తులెవర్ని ఆలయంలోకి అనుమతించలేదట. వ్యాసరాయలవారు గర్భగుడిలో ప్రవేశించి పాప నివృత్తి అయ్యేందుకు కఠోర దీక్షతో పూజలు నిర్వహించారట.
 
ఆ పన్నెండేళ్ల కాలంలో భక్తులకు గర్భగుడిలో ఉన్న మూల విరాట్టును దర్శించుకునే భాగ్యం కలుగలేదు. కానీ అందుకు ప్రతిగా ఆనంద నిలయ విమానం మొదటి అంతస్తులో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇలా ప్రతిష్టించిన వేంకటేశ్వర స్వామివారి విగ్రహం ఉత్తర వాయువ్యంలో ఉంటుంది. అప్పుడు ప్రతిష్టించిన స్వామివారి విగ్రహమే విమాన వేంకటేశ్వరస్వామి. అప్పుడు స్వామివారికి బదులుగా ప్రతిష్టించిన విమాన వేంకటేశ్వరస్వామిని ఇప్పటికీ భక్తి శద్ధలతో దర్శించుకుంటుంటారు.
 
తిరుమల వెళ్ళిన భక్తులు తప్పనిసరిగా విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం ఆచారంగా మారింది. ప్రస్తుతం ఆనంద నిలయానికి ఉత్తర వాయువ్యంలో విమాన వేంకటేశ్వరుని విగ్రహం వద్ద బంగారు, వెండిపూత పూసి మరింత శోభాయమానంగా తీర్చిదిద్దారు. తిరుమల దర్శించుకున్న భక్తులు తప్పనిసరిగా విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు.
 
అయితే ఇలాంటి ప్రచారం జరుగుతుండడంతో అర్చకులు విచారం వ్యక్తంచేస్తున్నారు. అసలు విషయం తెలియాలంటే బ్రిటీష్‌ ప్రభుత్వ కాలంలో 31-07-1801 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారి కైంకర్యపట్టీలను చూస్తే అందరికీ అర్థమవుతుందని అర్చకులు చెబుతున్నారు. అయితే అర్చకుల వాదన కన్నా విమాన వేంకటేశ్వరస్వామి చరిత్ర గురించే ప్రజల్లోకి ఎక్కువగా వెళుతోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

09-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : చీటికిమాటికి చికాకుపడతారు...

బుధవారం రోజున పూజ ఎలా చేయాలి? భార్యాభర్తలు కలిసి ఆచరిస్తే?

మీనరాశిలోకి మారుతున్న శుక్రుడు.. ఈ 3 రాశుల వారికి అంతా శుభమే

08-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : సంతానం చదువులపై దృష్టిపెడతారు...

ఇంట్లోకి నల్ల చీమలు వస్తున్నాయా.. ఇది మంచికేనా.. లేకుంటే?

తర్వాతి కథనం
Show comments