Webdunia - Bharat's app for daily news and videos

Install App

1,000 రాగి కలశాలతో మంత్రాలయంలో పవిత్ర క్షీరాభిషేకం (video)

సెల్వి
శుక్రవారం, 18 అక్టోబరు 2024 (11:10 IST)
Mantralayam
గురువారం మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి మూల బృందావనం వద్ద తమిళనాడుకు చెందిన దాదాపు 1,500 మంది భక్తులు దాదాపు 1,000 రాగి కలశాలను ఉపయోగించి పవిత్ర క్షీరాభిషేకం నిర్వహించారు. క్రతువును అనుసరించి ఊంజల మంటపంలో ఉత్సవమూర్తి ప్రహ్లాద రాయలుకు పూజలు చేశారు. గురువారం పవిత్రమైన రోజుగా భావించే రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం దేశవ్యాప్తంగా వేలాది మంది భక్తులు మంత్రాలయానికి తరలివచ్చారు. 
 
ఈ కార్యక్రమానికి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. గ్రామ దేవత మంచాలమ్మ, రాఘవేంద్ర స్వామిలను తుంగభద్ర నదిలో పుణ్యస్నానం ఆచరించి మూల బృందావనం వద్దకు తీసుకెళ్లారు. 
 
పీఠాధిపతి సుబుధేంద్రతీర్థ ఫలమంత్ర అక్షింతలు వేసి భక్తులను ఆశీర్వదించారు. మంత్రాలయం వీధులు, మధ్వ కారిడార్, తుంగభద్ర నదీ తీరాలు వేలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రాణాలతో ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలి... లారెన్స్ బిష్ణోయ్ గ్రూపు వార్నింగ్

జగన్నాథ్ మహాప్రసాదంలో దేశీ నెయ్యినే వాడుతున్నారా?

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టీమ్‌లోకి ఆమ్రపాలి

బీహార్ కల్తీసారా ఘటన : 32కు చేరిన మృతులు - అంపశయ్యపై మరికొందరు..

రెస్టారెంట్లలో బిర్యానీ తినాలంటే భయం.. పన్నీర్ బిర్యానీలో చికెన్ ముక్కలు

అన్నీ చూడండి

లేటెస్ట్

15-10-2024 మంగళవారం రాశి ఫలితాలు- ఎవరినీ తక్కువగా అంచనా వేయొద్దు

మోదుగ చెట్టును ఇంట్లో నాటవచ్చా...?

14-10-2024 సోమవారం దినఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

13-10- 2024 ఆదివారం దినఫలితాలు : మీ శ్రీమతి సలహా పాటిస్తారు...

13-10-2004 నుంచి 19-10-2024 వరకు మీ వార ఫలితాలు

తర్వాతి కథనం
Show comments