Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుద్ధ జయంతి: అర్థరాత్రి రాజభవనం నుంచి బయటకు వచ్చాడు

Webdunia
సోమవారం, 16 మే 2022 (16:11 IST)
బాల్యంలో సిద్ధార్థుడు అని పిలువబడే బుద్ధుడు రాజవుతాడు కానీ విరక్తుడై లోకకళ్యాణ కారకుడవుతాడని పండితులు చెప్పడంతో గౌతముని తండ్రి శుద్ధోదనుడు పెద్ద భవనం నిర్మించి రాకుమారుని అందులో ఉంచాడు. రోగములు, దుఃఖములు, మృత్యువులు ఏమీ తెలియనీయకుండా పెంచాడు.


ఆ తర్వాత గౌతమునికి యశోధరతో వివాహం జరిపించాడు. వీరికి రాహులుడు అనే పుత్రుడు కలిగాడు. ఒకసారి నగరము చూచేందుకు వెలుపలకు వచ్చాడు సిద్ధార్థుడు. నగరము నందు తిరిగే సమయంలో ఒక వృద్ధుడు కనిపించాడు. మరోసారి నగరం సందర్శించేటపు ఒక రోగి కనిపించాడు. మూడోసారి చనిపోయినవాడు కనిపించాడు. 

 
ఈ దృశ్యాలను చూచిన సిద్ధార్థుని మనస్సు చలించిపోయింది. సంసార సుఖము నుండి విరక్తి చెందాడు. అమరతత్వమును పరిశోధించేందుకు ఒక అర్థరాత్రి రోజున రాజభవనం నుండి బయటికి వచ్చి, తపస్సు చేసి బుద్ధుడైయ్యాడు. ప్రపంచమంతా తిరిగి మానవ ధర్మాలను ప్రచారం గావించిన బుద్ధుడు, యజ్ఞములందు పశువధను మాన్పించాడు. జీవుల పట్ల ప్రేమ, అహింస సద్భావములతో అమర సందేశమిచ్చాడు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో అభివృద్ధి పనుల పునఃప్రారంభం: జగన్‌ను తప్పకుండా ఆహ్వానిస్తాం

రోడ్డు ప్రమాదం: వెంటనే స్పందించిన నాదెండ్ల మనోహర్

Hyderabad, పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఫ్లై ఓవర్ నుంచి వేలాడిన తాగుబోతు (video)

భారత్ పర్యటనలో జేడీ వాన్స్.. అక్షరధామ్ ఆలయంలో వాన్స్ ఫ్యామిలీ

'నేను ఓ రాక్షసుడుని చంపేశాను' : కర్నాటక మాజీ డీజీపీ హత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

గుడ్ ఫ్రైడే: మానవాళికి శాశ్వతమైన మోక్షాన్నిచ్చిన జీసస్

12 సంవత్సరాల తర్వాత ఏర్పడే గజ లక్ష్మీ రాజయోగం- ఆ 3 రాశులు వారు పట్టిందల్లా?

పంచమి తిథి : వారాహి దేవిని ఇలా పూజిస్తే?

17-04-2025 గురువారం ఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

రాహు-కేతు పరివర్తనం.. సింహం, కన్యారాశికి అంతా అనుకూలం

తర్వాతి కథనం
Show comments