Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళి పందిళ్ళకు అరటిని ఎందుకు కడతారో తెలుసా?

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (14:28 IST)
గాలిలోని వ్యాధికారక సూక్ష్మ జీవులను చంపేశక్తి అరటిలో ఉందట. అరటికి తీపి, వగరు, రుచులు కలిగి చలువ చేసే గుణం ఉంది. దేహపుష్టిని పెంచుతుందట. అరటిపండు మధ్యలో మిరియాల పొడి చూర్ణాన్ని ఉంచి తింటే ఎంతటి మొండి దగ్గు అయినా తగ్గిపోతుందట.
 
అరటి దుంపను మెత్తగా నూరిన దాన్ని పొత్తి కడుపు మీద వేసి కడితే వెంటనే ఆగిన మూత్రం బైటికి వస్తుందట. అంతే కాకుండా అరటి ఊచ రసాన్ని సేవిస్తుంటే ఆగిన బహిస్టు మళ్ళీ మొదలై సాఫీగా వస్తుంది. 
 
స్త్రీలలో వచ్చే ఎర్రబట్టకు అరటిపండు, నెయ్యి చక్కటి ఔషధం. అరటిపువ్వు దంచి రసం తీసి వడగట్టి పెరుగు అంతే మోతాదులో కలిపి తింటుంటే రక్త జిగట విరేచనాలు ఆగిపోతాయట. అరటి ఆకులో అన్నం తింటే ఆయువు వృద్ధి, ఆరోగ్యం కూడా. అందుకే పెళ్ళి, పండుగ దినాల్లో అరటి ఆకులను వేసి మరీ వడ్డిస్తుంటారు.
 
పెళ్ళి పందిళ్ళకు అరటి స్థంభాలకు కట్టడం వల్ల శుభ సంకేతమే కాకుండా, గాలిలోని వ్యాధికారక సూక్ష్మజీవులను చంపే శక్తి అరటిలో ఉంది. రక్తవిరేచనాలు, రక్తస్రావం, రక్తవాంతులు, అతిసారం మూత్రావయావాల్లో రాళ్ళు ఈ వ్యాధులన్నింటినీ అతి సులువుగా జయించగల శక్తి అరటిలో ఉందట. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments