Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరణించాక యమలోకానికి చేరుకోవడానికి 47 రోజులు పడుతుందట!

పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు. అలాగే చనిపోయిన మనిషి స్వర్గానికో నరకానికో పోకా తప్పదు. కాని అందరికీ తెలియని విషయం ఏమిటంటే... చనిపోయిన మనిషి జెట్ వేగంతో యమలోకానికి వెళ్తారని అందరూ అనుకుంటారు. మరణించ

Webdunia
శనివారం, 16 జులై 2016 (11:43 IST)
పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు. అలాగే చనిపోయిన మనిషి స్వర్గానికో నరకానికో పోకా తప్పదు. కాని అందరికీ తెలియని విషయం ఏమిటంటే... చనిపోయిన మనిషి జెట్ వేగంతో యమలోకానికి వెళ్తారని అందరూ అనుకుంటారు. మరణించిన వ్యక్తి మంచివాడయితే స్వర్గానికి వెళ్తారని, చెడు పనులు చేస్తే నరకానికి వెళ్తారని  హిందూ పురాణాలు చెబుతున్నాయి. 
 
ప్రతి ఒక్కరి తలరాత, వారు స్వర్గానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా నిర్ణయించేది యమరాజు. ఎవరు స్వర్గానికి వెళ్తారు, ఎవరు నరకానికి వెళ్తారు అనేది ఆయనే నిర్ణయిస్తారు. ఒకవేళ మరణం తర్వాత ఆత్మ యమలోకంలోని యమరాజు దగ్గరకు వెళ్తే ప్రయాణం ఎలా ఉంటుంది ? అసలు మరణం తర్వాత యమలోకానికి వెళ్లే మార్గం గురించి గరుడ పురాణం చెప్పే విషయాలని ఓసారి  పరిశీలిద్దాం...
 
చనిపోయిన తర్వాత యమలోకానికి చేరుకోవడానికి 47 రోజుల ప్రయాణం పడుతుందట. చనిపోయిన వ్యక్తి చెడు పనులు హత్యలు, అక్రమాలు, దొంగతనాలు వంటి నేరాలు చేస్తే డైరెక్టుగా నరకానికి వెళ్తారని గరుడ పురాణం చెబుతోంది. చనిపోవడానికి కొంత సమయం ముందు నుంచి ఆ వ్యక్తికి మాట్లాడాలని ఉన్నా..మాట్లాడలేకపోతాడు. నోరు మూగబోతుంది. తను ఈ లోకంలో జీవించిన జీవితాన్నంతటినీ ఒక్కసారి చూడగలుగుతాడు.
 
జీవితపు చివరి క్షణాల్లో అతనిలో దివ్యదృష్టి తెరుచుకుని.. ప్రపంచాన్నంతటినీ అర్థం చేసుకోగలుగుతారట.  శరీరంలో ఎలాంటి చలనం లేకుండా.. గట్టిగా మారిపోతుందట. తనను యమలోకానికి తీసుకెళ్లడానికి యమరాజు పంపిన యమదూతలను మాత్రమే అతని కళ్లకి కనిపిస్తాడట. యమదూతల భయంకర రూపం చూసి.. నోరు కూడా తడారిపోతుందట. యమదూతలను చూసిన వెంటనే చనిపోయిన వ్యక్తి చాలా భయానికి గురై మూత్రం, లేదా మలవిసర్జన చేస్తారని పురాణంలో చెప్పబడుతోంది.
 
యమలోకానికి వెళ్లేటప్పుడు ఆత్మ అలసిపోయినా.. విశ్రాంతి తీసుకోవడానికి యమదూతలు అనుమతించరట. యమలోకానికి వెళతున్న ప్రయాణాలలో ఆత్మను యమదూతలు చాలా భయాందోళనకు గురిచేస్తారట. మొండిగా వ్యవహరించే ఆత్మలను యమదూతలను అతి కిరాతకంగా కొరడాతో హింసిస్తారట.
 
దేవుడిని పూజించని వాళ్లకు, ఇతరుల తప్పులను క్షమించని వాళ్లకు స్వర్గానికి వెళ్లడానికి యమరాజు అనుమతించడట. యమలోకానికి చేరిన వెంటనే యమరాజు.. ఒకసారి.. ఆత్మను వాళ్లు చనిపోయిన స్థలానికి పంపిస్తారు. చనిపోయిన వ్యక్తికి తన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేస్తున్నారా ? లేదా ? ఆత్మ శాంతి కోసం కర్మ నిర్వహిస్తారా లేదా అని తెలుసుకోవడానికి ఆత్మను మళ్లీ కిందకు పంపుతాడు. ఒకవేళ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించకపోతే.. ఆత్మ ప్రశాంతంగా ఉండే ప్రదేశాలలో సంచరిస్తూ ఉంటుందట. ఇదీ సంగతి...!
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD Cultural Scam: టీటీడీ, హెచ్డీపీపీ పేరిట కళాకారులకు టోపీ: రూ. 35లక్షల మోసం.. వ్యక్తి అరెస్ట్

03-07-2025 గురువారం దినఫలితాలు - పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం...

Mustard Oil Lamp: ఆదివారం పూట ఈ దీపాన్ని వెలిగిస్తే.. వాస్తు దోషాలు పరార్

జనవరి 29-31 వరకు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మేడారం మహా జాతర

TTD: దర్శన టిక్కెట్ల కోసం మధ్యవర్తుల బారిన పడవద్దు.. టీటీడీ

తర్వాతి కథనం
Show comments