Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి దర్శనం క్రమబద్ధీకరణ-నెలరోజుల్లో చర్చావేదిక!: తితిదే

Webdunia
FILE
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) క్రమబద్ధీకరణ చేయాలని భావిస్తోంది. రోజు రోజుకీ పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని శ్రీవారి దర్శనం క్రమబద్ధీకరణ చేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలో ప్రతిరోజూ 50వేల భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించి, ఏడాది పొడవునా లఘు దర్శనం అమలు చేయాలని భావిస్తున్నట్లు టీటీడీ ఈవో కృష్ణారావు తెలిపారు.

ప్రతిరోజూ భారీ సంఖ్యలో భక్తుల రద్దీ పెరగడంతోనే క్రమబద్ధీకరణ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆయన చెప్పారు. రోజుకు 50వేల మందిని మాత్రమే శ్రీవారికి దర్శనానికి అనుమతించడం, ఏడాది పూర్తిగా లఘు దర్శనం అమలు చేయడం ద్వారా భవిష్యత్తులో ఇబ్బందులుండవని ఈవో పేర్కొన్నారు.

శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం అలిపిరి వద్ద వసతి గృహాల ఏర్పాటుకు కూడా రంగం సిద్ధమవుతున్నట్లు ఆయన తెలియజేశారు. శ్రీవారి దర్శన క్రమబద్ధీకరణ సాధ్యాసాధ్యాలపై నెల రోజుల్లో చర్చావేదిక ఏర్పాటు చేస్తామని ఈవో కృష్ణారావు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే తిరుమల జేఈఓగా శ్రీనివాస రాజు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. శ్రీవారి ఆలయంలోని గనాయకమండపంలో ఆయన బాధ్యతలు చేపట్టినట్లు తితిదే తెలిపింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: సెప్టెంబర్ నెలకు ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లు విడుదల

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

15-06-2025 ఆదివారం దినఫలాలు - ఖర్చులు విపరీతం...

15-06-2025 నుంచి 21-06-2025 వరకు ఫలితాలు

Show comments