Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనం తర్వాత వేపుడు బియ్యం, అటుకులు తినకూడదట!

Webdunia
FILE
కుక్క, కోడి చూస్తుండగా భోజనం చేయకూడదని, వాటికి కాసింత పెట్టి తర్వాత తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆకలితో ఉన్నప్పుడు ఆహారం తీసుకోవడం మంచి పద్దతి. మిక్కిలి వేగంగా గానీ, చాలాసేపుగానీ తినకూడదు. చల్లారిన అన్నాన్ని మళ్లీ వెచ్చ పెట్టి తినకూడదు.

నెయ్యి మొదలైన ఒకటి, రెండు పదార్థాలను వెచ్చ పెట్టవచ్చునుగాని, మిగిలిన వాటిని అలా చేయకూడదు. అలాంటి ఆహారం విషంతో సమానం. మిక్కిలి వేడి అన్నం బలాన్ని పోగొడుతోంది. అలాగే బాగా చల్లబడిన ఆహారం జీర్ణం కాదు.

అలాగే ఆహారంలో గోధుమ, యవలు, కరక్కాయ, ఉసిరిక, ద్రాక్షలు, పెసలు, పంచదార, నేయి, పాలు, తేనె, దానిమ్మ-వీటిని ప్రతిరోజూ తినాలి. అయితే ఉసిరికను మాత్రం పూర్ణిమ, అమావాస్య, ఏకాదశి, సప్తమి, ఆదివారం, రేవతి నక్షత్రం రోజున, సూర్య సంక్రమణంనాడు, రాత్రి పూట తీసుకోకూడదు.

ఇక పిండితో చేసిన పదార్థాలు, వేపుడు బియ్యం, అటుకులు మొదలైనవి భోజనం తర్వాత తినకూడదని వైద్యశాస్త్రం పేర్కొంటోంది. ముందు కష్టంగా జీర్ణమయ్యే పదార్థాలను, నేతితో కూడుకున్న వాటిని, తర్వాత తేలికగ్గా జీర్ణం అయ్యేవాటిని, చివరిగా మజ్జిగా తీసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: సెప్టెంబర్ నెలకు ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లు విడుదల

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

15-06-2025 ఆదివారం దినఫలాలు - ఖర్చులు విపరీతం...

15-06-2025 నుంచి 21-06-2025 వరకు ఫలితాలు

Show comments