Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంటిపిల్లల తల్లిదండ్రులకు మహాద్వార ప్రవేశం రద్దు?

Webdunia
FILE
చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనార్థం అమలు చేసిన మహాద్వార ప్రవేశాన్ని రద్దు చేసే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం యోచిస్తోంది.

బుధవారం తిరుమలలో జరిగిన విలేకరుల సమావేశంలో ఛైర్మన్ డీకే ఆదికేశవులు ఈ విషయాన్ని సూత్రప్రాయంగా తెలిపారు. మహాద్వార దర్శనానికి బదులు బుధవారం నుంచి తితిదే అమలు చేసిన శీఘ్రదర్శనం క్యూలైన్లలో వీరిని అనుమతించాలని భావిస్తున్నారు.

మొదటి వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచి ప్రారంభమయ్యే శీఘ్రదర్శనం క్యూలైన్‌లో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం ఉండటమే గాకుండా.. ఈ మార్గంలో వారిని అనుమతించడంవల్ల లగేజీ స్కానింగ్ కూడా సాధ్యపడుతుందని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ విధానం అమల్లోకి వస్తుందని ఛైర్మన్ తెలిపారు.

ఇదిలా ఉంటే.. శ్రీవారి ఘంటారావాన్ని బుధవారం నుంచి శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ప్రారంభించారు. స్వామివారి నివేదన ఘంటానాదాన్ని ఉదయం, రాత్రి ప్రసారం చేసేలా ఏర్పాట్లు చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెజాన్ సామాజిక అభివృద్ధి: తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో 4వ మోడల్ స్కూల్‌ పునరుద్ధరణ

శత్రుత్వాన్ని తగ్గించుకోండి.. దౌత్యపరంగా పరిష్కరించుకోండి... మోడీ సూచన

ఎయిరిండియా విమానాన్ని పేల్చివేస్తాం : ఏఐ-114 బాంబు బెదిరింపు

సింగయ్య మృతి : పోలీసుల అదుపులో వైఎస్ జగన్ కారు డ్రైవర్

దామోదర రాజనర్సింహ పేరుతో సినిమా తీయాలనుకుంటున్నా : బాలకృష్ణ

అన్నీ చూడండి

లేటెస్ట్

బుధవారం అష్టమి రోజున ఇలా చేస్తే?

18-06-2025 బుధవారం దినఫలితాలు - అప్రియమైన వార్త వినవలసివస్తుంది

TTD: సెప్టెంబర్ నెలకు ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లు విడుదల

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

Show comments