Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా రైల్వే బడ్జెట్ ప్రజల అంచనాలను అందుకుంటుంది... గౌడ ట్వీట్

Webdunia
మంగళవారం, 8 జులై 2014 (11:54 IST)
కేంద్ర రైల్వేమంత్రి సదానంద గౌడ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ట్విట్టర్ ద్వారా తన స్పందనను తెలియజేశారు. ఐతే నరేంద్ర మోడీ చెప్పినట్లు హిందీలో కాదులెండి, ఇంగ్లీషులో. రైల్వేమంత్రిగా తాను ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ప్రజల అంచనాలను అందుకుంటుందని భావిస్తున్నట్లు ట్వీట్ ద్వారా తెలియజేశారు.
 
లోక్‌సభలో 2014-15 సంవత్సరానికి గాను రైల్వే బడ్జెట్‌ను కేంద్ర రైల్వే శాఖామంత్రి సదానంద గౌడ ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర రైల్వే మంత్రి హోదాలో ఆయన తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే ప్రయాణ ఛార్జీలను 14.2 శాతం, సరకు రవాణా ఛార్జీలను 6 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం... బడ్జెట్లో ఏం చేయబోతోందా? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. 
 
ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయిన నేపథ్యంలో, రైల్వే మంత్రి విభిన్న రీతిలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారనే అంచనాలు ఉన్నాయి. కొత్త రైళ్లు, నూతన రైల్వే మార్గాల విషయంలో కూడా సదానంద వాస్తవిక దృక్పథంతో వ్యవహరించనున్నట్టు సమాచారం. లాభదాయకం కాని ప్రాజెక్టులను రద్దు చేయడానికి కేంద్రం ఏ మాత్రం వెనుకడుగు వేయదనే సంకేతాలను ఇప్పటికే ఆయన పంపించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Show comments