ట్విట్టర్ - ఫేస్‌బుక్ ఖాతాలు తెరిచిన భారతీయ రైల్వే!

Webdunia
మంగళవారం, 8 జులై 2014 (11:47 IST)
ప్రజలతో మరింత దగ్గరగా అనుసంధానం కావడానికి సామాజిక సమాచారం అనుసంధాన సాధనాలైన ట్విట్టర్, ఫేస్‌బుక్ ఖాతాలను భారతీయ రైల్వే ప్రారంభించింది. తమ శాఖకు చెందిన సమాచారాన్ని అత్యంత వేగంగా ప్రజలతో పంచుకునేందుకే ఈ ఖాతాలు అంటూ రైల్వే మంత్రి సదానంద గౌడ తెలిపారు.
 
కాగా, మంగళవారం లోక్‌సభలో మధ్యాహ్నం 12 గంటలకు రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆ వివరాలు కూడా ఈ సామాజిక సైట్లలో లభిస్తాయి. నెటిజన్లు facebook.com/RailMinIndia, twitter@RailMinIndia అనే పేర్లతో రైల్వే శాఖతో అనుసంధానం కావచ్చు. 
 
మరోవైపు.. ఈ రైల్వే బడ్జెట్ పై కొత్తగా ఏర్పడిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. మోడీ ప్రభుత్వం ఈ సమావేశాలలో తమ తొలి రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టనుండ౦తో సర్వత్రా దీనిపై ఆసక్తి నెలకొంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vaishnavi : ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ నుండి ప్రియసఖి మెలోడీ గీతం విడుదల

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Show comments