సుబ్రహ్మణ్య షష్ఠి రోజున అరటి పండు నైవేద్యం పెడితే..?

Webdunia
శనివారం, 22 నవంబరు 2014 (17:02 IST)
సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ద్వారా సంతానం కలుగుతుందని విశ్వాసం. కుమార స్వామి అనుగ్రహం కారణంగా గ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయని పండితులు అంటున్నారు. 
 
అలాంటి సుబ్రహ్మణ్యస్వామి జన్మించిన మార్గశిర శుద్ధ షష్ఠి 'సుబ్రహ్మణ్య షష్ఠి' గా చెప్పబడుతోంది. ఈ నెల 28న వచ్చే ఆ రోజున సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం వలన, ఆయన అనుగ్రహంతో పాటు పార్వతీ పరమేశ్వరుల కరుణా కటాక్షాలు లభిస్తాయని పండితులు అంటున్నారు. 
 
ఆ రోజు ఉదయాన్నే లేచి శుచిగా తలస్నానం చేసి, ఉపవాస దీక్షను చేపట్టి, నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. పూజా మందిరంలో గల సుబ్రహ్మణ్యస్వామికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. 
 
పాయసం, కందిపప్పుతో కూడిన వివిధ రకాల పదార్థాలను ఆయనకి నైవేద్యంగా సమర్పించాలి. దానిమ్మ, అరటిపండ్లను కూడా స్వామివారికి నివేదన చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

హరీష్ రావు గుంటనక్క.. సరే.. జగన్, పవన్, లోకేష్‌లపై కల్వకుంట్ల కవిత ఏమన్నారు?

అనుకున్నదానికంటే ఎక్కువే చేశాం.. ఇరాన్‌పై యుద్ధానికి త్వరలోనే చరమగీతం.. ట్రంప్

Jagan: చంద్రబాబు ఉప ప్రధానా? ఎవరు చెప్పినారు సామీ..?: వైఎస్ జగన్ (video)

Titanic pose: జాక్, రోజ్‌లా టైటానిక్ ఫోజు ఇచ్చిన ట్రంప్ ఎఫ్‌స్టీన్.. Epstein Files సంగతి ఏంటి? (video)

ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్.. గేర్ విరిగి చక్రం విడిపోయింది.. తర్వాత? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

ఆదాయం పెరగాలంటే.. ధనవంతులు కావాలంటే.. చాణక్య నీతిని..?

09-03-2026 సోమవారం ఫలితాలు : దంపతుల మధ్య అకారణ కలహం...

08-03-2026 ఆదివారం ఫలితాలు- మీ కృషికి అదృష్టం తోడవుతుంది

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలో కుంభాభిషేకం, గోపురం చూసినా చాలు...

08-03-2026 నుంచి 14-03-2026 వరకు ఫలితాలు-నేటి కంటే రేపు శుభం అన్న భావంతో...

Show comments