Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ వేంకటేశ్వర స్వామిని వేడుకుంటే చాలు... అన్నీ..?

Webdunia
శనివారం, 17 జనవరి 2015 (15:37 IST)
శ్రీ వేంకటేశ్వరుడు నిత్యకళ్యాణం.. పచ్చతోరణం అనే మాటను నిజం చేస్తుంటాడు. సౌందర్యమంటే శ్రీనివాసుడిదే, సంపదంటే శ్రీనివాసుడిదే, సూర్యభగవానుడితో సమానమైన తేజస్సు ఆయనదే అన్నట్టుగా ఆ స్వామి కనిపిస్తుంటాడు. గర్భాలయం నిండుగా కళకళలాడుతూ ఆయన దర్శనమిస్తూ వుంటే, కష్టాలు చెప్పుకోవడానికి వచ్చిన వాళ్లు సైతం ఆ విషయాన్ని మరిచిపోయి అలాగే చూస్తుండిపోతారు.
 
అలాంటి విశిష్టమైన ఆలయాలలో ఒకటి మనకి 'మిర్యాలగూడెం'లో దర్శనమిస్తుంది. నల్గొండ జిల్లా పరిధిలో గల ఈ క్షేత్రంలో అలమేలుమంగ - పద్మావతీ సమేత వేంకటేశ్వరస్వామి కొలువుదీరి కనిపిస్తుంటాడు.
 
గర్భాలయంలో గల మూలమూర్తి నిలువెత్తు రూపం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. గర్భాలయానికి ఇరువైపులా గల ప్రత్యేక మందిరాలలో అమ్మవార్లు కొలువై పూజలందుకుంటూ వుంటారు. ఆలయ ప్రాంగణంలోనే ఓ వైపున హనుమంతుడు ... నాగేంద్రుడు దర్శనమిస్తూ వుంటారు.  
 
ప్రతి శనివారంతో పాటు విశేషమైన పర్వదినాల్లో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా వుంటుంది. ఎవరు ఎలాంటి కష్టాల్లో వున్నా ఈ వేంకటేశ్వరుడిని వేడుకుంటే చాలట. అనతికాలంలోనే అవన్నీ తొలగిపోతాయనీ, ఆనందకరమైన జీవితం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

Hyderabad: స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25- ఆరవ పరిశుభ్రమైన నగరంగా హైదరాబాద్

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అన్నీ చూడండి

లేటెస్ట్

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

Show comments