శనిదోష నివారణకు ఇలా చేస్తే..?

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (11:11 IST)
కొందరైతే వృత్తి ఉద్యోగాల్లో ఎంతగా శ్రమిస్తున్నా ఉన్నతి సాధించలేకపోతుంటారు. మెరుగైన పనితీరు, చిత్తశుద్ధి వంటి లక్షణాలను కలిగి ఉన్నా తగిన పదోన్నతులు, వేతన ప్రతిఫలాలను పొందలేకపోతుంటారు. జాతకంలో శని అనుగ్రహం లోపించినప్పుడు, రాజ్యాధిపతి, రాజ్యభావం బలహీనపడినప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఈ సమస్య నుండి విముక్తి చెందాలంటే.. కొన్ని పరిహారాలు చేయవలసి ఉంటుంది. అవేంటో ఓసారి చూద్దాం..
 
ప్రతి నెల ఏదైనా గురువారం ఇంటికి దగ్గరగా ఉన్న ఆలయానికి వెళ్లి తీపి గుమ్మడికాయను సమర్పించాలి. అలాగే ఆలయ పూజారులకు లేదా పురోహితులకు వస్త్రదానం చేయాలి. ఇలా చేస్తే శని గ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. అలానే మేనత్తలకు, అక్కచెల్లెళ్లకు చిన్నపాటివైనా కానుకలు ఇవ్వడానికి సందర్భాలతో నిమిత్తం లేదు. చదువుకోసం సాయం కోరే ఆడ పిల్లలకు ఆర్థిక సాయం చేస్తే మంచిది. 
 
ఆశలు వదలుకునిపోతున్న స్థితిలో గ్రహబలానికి మించి దైవబలం మిన్నగా పనిచేస్తుంది. కనుక ప్రతి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి స్వామి వారి కుడికాలి బొటనవేలి పై ఉన్న సింధూరాన్ని నుదుటిపై తిలకంగా పెట్టుకోవాలి. ఇలా ప్రతి మంగళవారం క్రమంగా హనుమంతుని ఆలయానికి వెళితే గ్రహ దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. 
 
శని దేవునికి ప్రీతి కలిగించడం ద్వారా ఆశించిన ఫలితాన్ని సాధించవచ్చు. పదోన్నతులు, వేతన ప్రతి ఫలాలు ఆశించిన స్థాయిలో దక్కనందుకు నిరాశ అనిపించినా, కుంగిపోవద్దు. పనితీరుపై శ్రద్ధ తగ్గించవద్దు. చిత్తశుద్ధితో విధి నిర్వహణ కొనసాగిస్తూనే, శని ప్రీతికోసం ప్రతిరోజూ ఉదయం కాకులకు ఆహార పానీయాలను సమర్పించాలి. శనిదేవునికి కాకి అంతే పరమ ప్రీతి. కనుక ప్రతీ శనివారం నాడు కాకులకు పానీయాలు సమర్పించండి.. ఈతిభాదలు, గ్రహ దోషాలు తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గిల్లితే కాటేస్తాం, ఇరాన్ వార్నింగ్: ట్రంప్ 5 అడుగులు వెనక్కి, యుద్ధం విరమణ అంటూ...

తమిళనాడు ఎన్నికల్లో డీఎంకేదే హవా.. టీవీకే, ఎన్టీకేలకు ఓటమి తప్పదు.. సర్వే

పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలు.. టీవీకే 30మంది అభ్యర్థుల జాబితా రిలీజ్

సువర్ణాధ్యాయం లిఖించిన 'బ్లాక్ టైగర్' : ఎవరీ అసమాన దేశభక్తుడు!!

కోతుల గుంపు దాడి.. కాకినాడలో 65 ఏళ్ల వృద్ధురాలు మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

20-03-2016 శుక్రవారం ఫలితాలు - ధన సమస్య ఎదురయ్యే సూచనలున్నాయి..

ఇరాన్‌పై దాడి: తిరుమలలో మూతపడిన హోటల్స్.. టీ కూడా దొరక్కట్లేదు.. భక్తుల కష్టాలు

తిరుమల లడ్డూలలో కల్తీకి ఇక చెక్ : FSSAI ల్యాబ్ త్వరలో ప్రారంభం

భద్రాచలంలోని శ్రీరామనవమి- కల్యాణోత్సవానికి రేవంత్ రెడ్డికి పిలుపు

ఉగాది విశిష్టత.. 60 సంవత్సరాలు నారద మహర్షి సంతానమే.. పరాభవంతో భయం లేదు

తర్వాతి కథనం
Show comments