కలియుగంలో శివపురాణం పారాయణ చేస్తే..?

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (23:24 IST)
కలియుగంలో సులభమైన పద్ధతుల ద్వారా దేవరుల అనుగ్రహం పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. కలియుగంలో యజ్ఞాలు, యాగాలు, తపస్సు చేయనక్కర్లేదని.. నిష్ఠతో పది నిమిషాల ధ్యానం చేసి స్వామిని స్తుతిస్తే వారి ఖాతాలో కొన్ని జన్మల పుణ్యం చేరుతుందని వారు చెప్తున్నారు. అలా కొన్ని శ్లోకాలను పఠించడం ద్వారా దైవానుగ్రహం సులభంగా లభిస్తుందని వారు అంటున్నారు. అందులో ఒకటి శివపురాణం. 
 
కలియుగంలో శివ పురాణం చదవడం వల్ల త్వరితగతిన పాప విముక్తులు అవుతారు. దాంతో పాటు సకల ఐశ్వర్యవంతులుగా మారుతారని శివ పురాణం చెబుతోంది. అంతే కాదు శివ పురాణాన్ని అనుసరించడం వల్ల లేదా వినడం వల్ల పారాయణ చేయడం వల్ల శివానుగ్రహం తప్పకుండా ఉంటుంది. శివ ఆరాధనకు మించిన తరుణోపాయం ఏమి లేదని, పాపాలు పోగొట్టుకోవడానికి ఇదే మంచి మార్గమని సాక్షాత్తు శ్రీ మహా విష్ణువే స్వయంగా చెప్పారు.
 
మంచి భార్య కావాలన్నా, యోగ్యుడైన భర్త కావాలన్నా , మంచి సంతానం కావాలన్నా, ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం, కీర్తి, మోక్షం పొందాలనుకున్న శివుడిని ఆరాధించడమే మంచి మార్గమని విష్ణువు బ్రహ్మకు ఉపదేశించారు. కాబట్టి కలియుగంలో మనం కూడా ఈ పురాణాన్ని చదవడం చేస్తే అనుకున్న కార్యాల్లో విజయంతో పాటు పాపవిముక్తులమై.. మోక్ష మార్గాన్ని ఎంచుకున్నట్లవుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరినీ పార్టీ ఆఫీసుకు పిలవొద్దు.. అమరావతికి వచ్చాక వాళ్ల సంగతి తేలుస్తా... నేతలపై బాబు ఫైర్

కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా?

కర్నూలు ప్రమాదంపై రాష్ట్రపతి - ప్రధాని - బాబు - పవన్ తీవ్ర దిగ్బ్రాంతి

కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని, రాష్ట్రపతి దిగ్భ్రాంతి.. రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా

Tamil Nadu: కన్నతల్లినే హత్య చేసిన కొడుకు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

karthika maasam food: కార్తీక మాసంలో తినాల్సిన ఆహారం ఏమిటి, తినకూడనవి ఏమిటి?

టీటీడీకి రూ.900 కోట్లు-ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో పెరిగిన విరాళాలు

Karthika Masam: కార్తీక మాసం ప్రారంభం.. దీపారాధన, దీపదానం.. బిల్వార్చన చేస్తే?

22-10-2025 బుధవారం దినఫలాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం.. నిర్విరామంగా శ్రమిస్తారు...

21-10-2025 మంగళవారం దినఫలాలు - ఆత్మీయులతో సంభాషణ మనోధైర్యాన్నిస్తుంది...

తర్వాతి కథనం
Show comments