కలియుగంలో శివపురాణం పారాయణ చేస్తే..?

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (23:24 IST)
కలియుగంలో సులభమైన పద్ధతుల ద్వారా దేవరుల అనుగ్రహం పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. కలియుగంలో యజ్ఞాలు, యాగాలు, తపస్సు చేయనక్కర్లేదని.. నిష్ఠతో పది నిమిషాల ధ్యానం చేసి స్వామిని స్తుతిస్తే వారి ఖాతాలో కొన్ని జన్మల పుణ్యం చేరుతుందని వారు చెప్తున్నారు. అలా కొన్ని శ్లోకాలను పఠించడం ద్వారా దైవానుగ్రహం సులభంగా లభిస్తుందని వారు అంటున్నారు. అందులో ఒకటి శివపురాణం. 
 
కలియుగంలో శివ పురాణం చదవడం వల్ల త్వరితగతిన పాప విముక్తులు అవుతారు. దాంతో పాటు సకల ఐశ్వర్యవంతులుగా మారుతారని శివ పురాణం చెబుతోంది. అంతే కాదు శివ పురాణాన్ని అనుసరించడం వల్ల లేదా వినడం వల్ల పారాయణ చేయడం వల్ల శివానుగ్రహం తప్పకుండా ఉంటుంది. శివ ఆరాధనకు మించిన తరుణోపాయం ఏమి లేదని, పాపాలు పోగొట్టుకోవడానికి ఇదే మంచి మార్గమని సాక్షాత్తు శ్రీ మహా విష్ణువే స్వయంగా చెప్పారు.
 
మంచి భార్య కావాలన్నా, యోగ్యుడైన భర్త కావాలన్నా , మంచి సంతానం కావాలన్నా, ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం, కీర్తి, మోక్షం పొందాలనుకున్న శివుడిని ఆరాధించడమే మంచి మార్గమని విష్ణువు బ్రహ్మకు ఉపదేశించారు. కాబట్టి కలియుగంలో మనం కూడా ఈ పురాణాన్ని చదవడం చేస్తే అనుకున్న కార్యాల్లో విజయంతో పాటు పాపవిముక్తులమై.. మోక్ష మార్గాన్ని ఎంచుకున్నట్లవుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

బిడ్డల కళ్లెందుటే కన్నతల్లి మృతి.. ఎలా? ఎక్కడ? (వీడియో)

యుద్ధంలో భారత్‌ను ఓడించలేని పాకిస్తాన్ ఉగ్రదాడులకు కుట్ర : దేవేంద్ర ఫడ్నవిస్

మెట్రో రైల్ ఆలస్యమైనా ప్రయాణికులపై చార్జీల బాదుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

Love: ప్రేమిస్తే ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిల్నే ప్రేమించాలి.. ఎందుకంటే?

20-11-2025 గురువారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...

శబరిమల మార్గంలో నెట్‌వర్క్‌ను మెరుగుపరిచిన Vi ; పిల్లల భద్రతకు అనువైన వి సురక్ష రిస్ట్ బ్యాండ్

Vaikunta Darshan: ఆన్‌లైన్‌లోనే వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ

19-11-2025 బుధవారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...

తర్వాతి కథనం
Show comments