మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆలయాల్లో మహేశునికి అభిషేకాది పూజలు చేయించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి. శివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయిస్తే.. జీవితంలో అనారోగ్య సమస్యలు తలెత్తవు. గోవు పాలు, పంచితంతో, పంచకవ్యంతో శివునికి అభిషేకం చేస్తే ముక్తి లభిస్తుంది. గోవు పాలుతో అభిషేకం చేస్తే దీర్ఘాయుష్షు చేకూరుతుంది.
తేనెతో అభిషేకం చేస్తే మానసిక ఆందోళనలను తొలగిపోతాయి. మధురమైన గాత్రం లభిస్తుంది. 1000 నిమ్మకాయలతో శివునికి అభిషేకం చేయిస్తే.. అజ్ఞానం తొలగిపోతుంది. పంచదారతో అభిషేకం జీవితంలో మనశ్శాంతి లభిస్తుంది. కొబ్బరి నీటితో శివునికి శివరాత్రి రోజున అభిషేకం చేయిస్తే కైలాస ప్రాప్తి లభిస్తుంది.
పంచామృతంతో అభిషేకంతో మనోబలం, కార్యసిద్ధి ఏర్పడుతుంది. పెరుగుతో శివాభిషేకం ఆరోగ్యం, శారీరక దారుఢ్యం ఏర్పడుతుంది. చెరకు రసంతో అభిషేకం ఆయుర్దాయాన్ని ఇస్తుంది.
గంగా జలంతో అభిషేకం.. ఈతిబాధలు తొలగిపోతాయి. భయం వుండదు. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. చందనం- పనీరుతో అభిషేకం.. దైవభక్తి ఏర్పడుతుంది. రుద్రాభిషేకం చేస్తే సర్వకార్యసిద్ధి.
శుద్ధి జలంతో శివాభిషేకం చేస్తే ఆర్థిక ఇబ్బందులు, అష్టకష్టాలు తొలగిపోతాయి. పుష్పాలతో శివునికి అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.