గృహానికి తూర్పు దిక్కున బావి త్రవ్వినచో, నీటి వసతికి ఏర్పాటు చేసిన సంపత్ వృద్ధి. ఈశాన్యంలో సౌఖ్యం, ఉత్తరాన అల్పసుఖం, గృహమధ్యలో ధననష్టం, వాయవ్యంలో శత్రుబాధ, నైరుతిలో మృత్యుభయం, దక్షిణాన భార్యావియోగం, ఆగ్నేయంలో పుత్రనాశనం సంభవిస్తుంది. కనుక యుక్తమయిన దిశ చూసుకుని నీటి వనరు ఏర్పాటు చేసుకోవాలి.
తిథులలో శుక్లపక్షం అయితే.. పాడ్యమి, చవితి, షష్ఠి, అష్టమి, ద్వాదశి తిథులు మినహా మిగిలినవన్నీ మంచివి. బహుళపక్షం అయితే కేవలం పాడ్యమి మంచిదని గ్రహించాలి. ఇల్లు కట్టేముందే ప్రహరీ గోడలు నిర్మించి ఈశాన్యంలో నీటివనరు ఏర్పాటు చేసుకుని.. అనంతరం ఇల్లు కట్టడం శ్రేయస్కరం.