2022 ఉత్పన్న ఏకాదశి : తులసి కోట ముందు నేతి దీపం వెలిగిస్తే?

Webdunia
శనివారం, 19 నవంబరు 2022 (18:58 IST)
కార్తీక పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. దేవుత్థాన ఏకాదశి తర్వాత వచ్చే ఏకాదశి ఇది. ఉత్పన్న ఏకాదశి ముఖ్యమైన ఏకాదశిలలో ఒకటి. 
 
ఉత్పన్న ఏకాదశిని ఏకాదశి పుట్టిన రోజుగా పరిగణిస్తారు. ప్రతి సంవత్సరం ఉపవాసం పాటించాలని ప్రతిజ్ఞ చేసే భక్తులు ఉత్పన్న ఏకాదశి నుండి ఏకాదశి ఉపవాసాన్ని ప్రారంభిస్తారు.
 
పారణ అంటే ఉపవాసం విరమించడం. ఏకాదశి ఉపవాసం మరుసటి రోజు సూర్యోదయం తర్వాత ఏకాదశి పారణ చేస్తారు. సూర్యోదయానికి ముందు ద్వాదశి ముగియని పక్షంలో ద్వాదశి తిథిలోగా పారణ చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా తియ్యని పదార్థాలను సమర్పించవచ్చు. 
 
ఉత్పన్న ఏకాదశి వంటి పవిత్రమైన రోజున సాయంకాలం వేళలో తులసి చెట్టును, విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల సకల సంపదలు పెరుగుతాయని విశ్వసిస్తారు. 
 
ముఖ్యంగా సాయంకాలం సమయంలో విష్ణుమూర్తిని స్మరించుకుంటూ తులసి కోట ముందు నేతి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్య పరంగా దీర్ఘకాలికంగా ఉండే సమస్యలన్నీ దూరమవుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపై వేగంగా కదిలే స్కూటర్ హ్యాండిల్ వదిలేసి కూర్చుని ఫీట్స్, వీడియో

సినీ రంగంలో తాగుబోతులు, తిరుగుబోతులే వుంటారు: సినీ పరిశ్రమపై పాశం యాదగిరి దారుణ వ్యాఖ్యలు

సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్.. కాంట్రాక్ట్ ఉద్యోగి సేఫ్

విద్యుత్ ట్రాన్స్‌మిషన్ సత్తాపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ AI ఆశలు

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన

అన్నీ చూడండి

లేటెస్ట్

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

తర్వాతి కథనం
Show comments