Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటి వారు తమ తల లేని నీడను చూస్తారట...

ప్రతి ఒక్కరిని వణికించే పదం మరణం. పుట్టిన ప్రతి ఒక్కరు మరణించక తప్పదు. ఎవ్వరు చావు నుండి బయటపడలేరు. శివ పురాణం ప్రకారం పరమేశ్వరుడిని మరణానికి వచ్చే సూచన ఏమిటి అని పార్వతిదేవి అడిగింది. ఒక వ్యక్తి మరణించే సమయంలో ఏం జరుగుతుందని శివుడిని పార్వతి దేవి ప్

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (12:52 IST)
ప్రతి ఒక్కరిని వణికించే పదం మరణం. పుట్టిన ప్రతి ఒక్కరు మరణించక తప్పదు. ఎవ్వరు చావు నుండి బయటపడలేరు. శివ పురాణం ప్రకారం పరమేశ్వరుడిని మరణానికి వచ్చే సూచన ఏమిటి అని పార్వతిదేవి అడిగింది. ఒక వ్యక్తి మరణించే సమయంలో ఏం జరుగుతుందని శివుడిని పార్వతి దేవి ప్రశ్నించింది. దీంతో శివుడు ఇలా చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి.
 
ఒక వ్యక్తి యొక్క శరీరం లేత పసుపు, తెలుపు లేదా కొద్దిగా ఎర్రగా మారినప్పుడు ఆ వ్యక్తి ఆరు నెలల లోపల మరణిస్తాడని చెప్పారట. ఒక వ్యక్తి నూనెలో, నీళ్ళలో, లేదా అద్దంలో తమ ప్రతిబింబాన్ని చూసినప్పుడు కనిపించకపోతే ఆరునెలల్లో మరణిస్తాడని చెప్పారట. ఎవరైతే చనిపోయే సమయం కంటే ఒక నెల ఎక్కువగా జీవిస్తారో వారు అస్సలు వారి సొంత నీడను చూడలేరని చెప్పారట. ఒకవేళ చూసినా వారు తలలేని నీడను చూస్తారట. 
 
ఒక వ్యక్తి నాలుక అకస్మాత్తుగా ఉబ్బినా, దంతాల నుంచి చీము పడుతున్నా వారు ఐదునెలల కన్నా ఎక్కువ కాలం జీవించరని చెప్పారట. వ్యక్తి యొక్క ఎడమ చెయ్యి వారం రోజుల పాటు గట్టిగా పట్టేసినట్లు ఉన్నా, లేకుంటే నరాల బిగుసుకుని ఉన్నా ఆ వ్యక్తి నెలకన్నా ఎక్కువ రోజులు బతకడని చెప్పారట. వ్యక్తి ఏది చూసినా ప్రతిదీ నల్లగా కనిపిస్తే ఆ వ్యక్తి చావు దగ్గరలో ఉన్నట్లేనట. అలాగే చంద్రుడు, సూర్యుడు, అగ్ని యొక్క వెలుగును చూడలేకున్నా, వ్యక్తి ఆకాశంలోని దృఢ నక్షత్రాన్ని చూడలేకున్నా, సూర్యుడు, చంద్రుడు, ఆకాశాన్ని చూసినప్పుడు ఎర్రగా కనిపిస్తే ఆ వ్యక్తి కూడా ఆరు నెలలకు మించి బతకడని శివుడు పార్వతికి చెప్పారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పట్టపగలే నడి రోడ్డుపై హత్య.. మద్యం తాగి వేధిస్తున్నాడని అన్నయ్యను చంపేశారు..

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన శబరి దేవస్థాన బోర్డు

16-02-2025 ఆదివారం రాశిఫలాలు - ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు...

భారతదేశపు రూ.6 లక్షల కోట్ల ఆలయ ఆర్థిక వ్యవస్థ: అంతర్జాతీయ టెంపుల్స్ కన్వెన్షన్-ఎక్స్‌పోలో చేరిన శ్రీ మందిర్

శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. మెగాస్టార్‌కు ఆహ్వానం

సూర్యుడు పాటించిన సంకష్టహర చతుర్థి వ్రతం.. నవగహ్రదోషాలు మటాష్

తర్వాతి కథనం
Show comments