Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌభాగ్యం స్థిరంగా నిలిచి వుండాలంటే.. స్త్రీలు ఎం చేయాలి?

Webdunia
శనివారం, 17 జనవరి 2015 (15:39 IST)
స్త్రీలు వట సావిత్ర వ్రతాన్ని 'జ్యేష్ఠ పౌర్ణమి' రోజున ఆచరిస్తుంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్లనే యమధర్మరాజుని ఎదిరించి సావిత్రి తన భర్త ప్రాణాలను కాపాడుకోగలిగిందని చెప్పబడుతోంది. వట వృక్షం మూలంలో బ్రహ్మదేవుడు ... మధ్య భాగంలో విష్ణువు ... పై భాగంలో శివుడు ఉంటాడని పండితులు చెబుతున్నారు. 
 
వట వృక్షాన్ని పూజిస్తూ సావిత్రి ఈ వ్రతాన్ని ఆచరించినది కాబట్టే, ఈ వ్రతానికి 'వట సావిత్రి' అనే పేరు వచ్చింది. ఈ వ్రతాన్ని త్రయోదశి రోజున ఆరంభించి పౌర్ణమి వరకూ, అంటే మూడు రోజులపాటు ఆచరించాలని శాస్త్రం చెబుతోంది. వివాహిత స్త్రీలు ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి, పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. మర్రిచెట్టు దగ్గరికి చేరుకొని అక్కడ శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టాలి.
 
పసుపు కుంకుమలతో వట వృక్షాన్ని పూజించి, నైవేద్యాలు సమర్పించాలి. పసుపు దారాన్ని వట వృక్షానికి చుడుతూ ... 'నమో వైవస్వతాయ 'అనే మంత్రాన్ని పఠిస్తూ 108 ప్రదక్షిణలు చేయాలి. ఆ తరువాత ముత్తయిదువులకు దక్షిణ తాంబూలాలతో పాటు పండ్లను దానంగా ఇవ్వాలి. ఈ విధంగా చేయడం వలన వైధవ్య దోషాలు తొలగిపోయి సౌభాగ్యం స్థిరంగా నిలిచి ఉంటుందని చెప్పబడుతోంది

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

Show comments