Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైవేద్యంగా ఏది పడితే అది పెట్టకూడదు.. అర్చకుడు నియమనిష్టలతో..?

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2015 (19:31 IST)
నైవేద్యంగా ఏది పడితే అది పెట్టకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. భగవంతుడికి చేసే షోడశ ఉపచారాలలో నైవేద్యం ఒకటి. ఈ నైవేద్యాన్ని అర్చకుడు మడి కట్టుకుని నియమనిష్టలను పాటిస్తూ తయారుచేస్తాడు. సాధ్యమైనంత వరకూ ఈ మహానైవేద్యం ఆలయపరిధిలో గల వంటశాలలోనే తయారు చేయబడుతూ వుంటుంది. ఇక నైవేద్యమనేది తినడానికి వీలుగా వుండేంత వెచ్చగా ఉన్నప్పుడే భగవంతుడికి సమర్పించాలి. చల్లగా చల్లారిపోయిన నైవేద్యాలు భగవంతుడికి పెట్టకూడదు. 
 
ఇలా భగవంతుడికి సమర్పించే మహానైవేద్యం నియమనిష్టలతో కూడినదిగా కనిపిస్తుంది. అందువలన ఇంటిదగ్గర తయారుచేసిన పదార్థాలు అక్కడి పూజామందిరం చెంతనే నైవేద్యంగా పెట్టాలి. ఆలయంలో ఆగమ శాస్త్రం ప్రకారం ప్రాణప్రతిష్ఠ చేసిన దైవానికి వాటిని నైవేద్యంగా సమర్పించే ప్రయత్నాలు చేయకూడదు. భక్తులు ఎప్పుడూ భగవంతుడికి వివిధరకాల పండ్లను మాత్రమే నైవేద్యంగా తీసుకురావాలి. వాటిని భగవంతుడికి నైవేద్యంగా పెట్టి, కొన్ని పండ్లను తిరిగి ప్రసాదంగా ఇవ్వడం జరుగుతూ వుంటుంది. ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వలన దైవదర్శన ఫలితం పరిపూర్ణంగా లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

Show comments