Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట ఇంట్లో దీపాలన్నింటినీ ఆర్పేస్తున్నారా...?

Webdunia
గురువారం, 25 అక్టోబరు 2018 (10:53 IST)
ఇంట్లో ఎప్పుడూ ఓ నూనె దీపం వెలుగుతూ వుంటే.. అనూహ్య ఖర్చులు వుండవు. రాత్రిపూట ఇంట్లోని దీపాలన్నీ ఆర్పేయకుండా... కనీసం ఒక్క దీపాన్నైనా వెలుగుతూ వుండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే డబ్బు చేతిలో నిలుస్తుంది. అదీ నూనె దీపాన్ని ఇంట వెలిగించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు వుండవని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 
 
ధనలాభం కోసం ఇంటి ప్రవేశ ద్వారం వున్న గోడకు తెలుపు, లేత నీలం, గులాబీ వంటి రంగులు వేసుకుంటే మంచిది. నలుపు, నిండు ఎరుపు రంగులు మాత్రం ఉపయోగించకూడదు. బీరువాలో డబ్బు ఉంచే లాకర్‌ను ప్రతిబింబించేలా ఒక అద్దాన్ని బీరువా తలుపు లోపలివైపు అమర్చితే ఖర్చులు తగ్గుతాయి. ఇంట్లో మనీ ప్లాంట్ ఉన్న కుండీ పెట్టుకొంటే డబ్బు, పెట్టుబడులకు ఎలాంటి నష్టం ఉండదు. 
 
ఇంట్లో పగిలిన గాజు వస్తువులు, కిటికీ అద్దాలు లేకుండా చూడాలి. గాజు వస్తువులను ఎప్పుటికప్పుడు శుభ్రం చేయాలి. ఇంట్లో సూర్య కిరణాలు పడే కిటికీ వద్ద స్పటికాల మాల వేలాడదీస్తే కాంతి శక్తి తరంగాలు ఇల్లంతా ప్రవహించి ఆర్ధిక లబ్ధి చేకూరుతుంది. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చూస్తే.. ఆదాయానికి లోటుండదు.
 
అవకాశం ఉన్నవారు ఇంట్లో ఈశాన్యాన చిన్న ఫౌంటెన్‌ పెట్టుకోవాలి. లేదా కనీసం నీరు పారే శబ్దం ఇంట్లో వచ్చేలా చూడాలి. దీనివల్ల సానుకూల శక్తి ప్రవహించి ఊహించనిరీతిలో సంపద చేరుతుందని పంచాంగ నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bus crash: ఆప్ఘనిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు- ట్రక్కు ఢీ.. 71మంది సజీవ దహనం

అన్నయ్యతో చెల్లెలు సంసారం.. ప్రెగ్నెంట్ కావడంతో భర్తకు డౌట్.. ఎందుకోసమంటే?

టీచర్‌ని ప్రేమించిన స్టూడెంట్.. చీర కట్టుకుని వచ్చింది.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్.. ఆమెకే ఈ పరిస్థితి అంటే?

ఉప్పొంగిన గోదావరి- కృష్ణానదులు.. భద్రాచలం వద్ద మొదటి వరద హెచ్చరిక జారీ

అన్నీ చూడండి

లేటెస్ట్

ఆదిత్యుడికి ఆరాధన చేస్తే ఫలితాలు ఏమిటో తెలుసా?

Dasara: శ్రీశైలంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా మహోత్సవాలు

TTD: తిరుత్తణి కుమార స్వామికి శ్రీవారి సారె -మంగళ వాద్యం, దరువుల మధ్య..?

వైకుంఠం క్యూ కాంప్లెక్స్-3 కోసం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం.. త్వరలో ప్రారంభం

కాలజ్ఞానం రాస్తున్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని తొలిసారి చూచినదెవరో తెలుసా?

తర్వాతి కథనం
Show comments