మూడో శ్రావణ శుక్రవారం... పంచమి కూడా వచ్చేస్తోంది..

సెల్వి
శుక్రవారం, 23 ఆగస్టు 2024 (13:54 IST)
శ్రావణమాసం అందులోను శుక్రవారం అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహిస్తే ఫలప్రదం అవుతుందని భక్తుల విశ్వాసం. శ్రావణమాసం మూడో శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని పూజించాలి. 
 
ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తెలుపు, ఎరుపు రంగు పువ్వులు అమ్మవారికి సమర్పించాలి. గులాబీ పువ్వులు, తామర పువ్వులు సమర్పించవచ్చు. 
 
సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు శ్రీలక్ష్మిని పూజించవచ్చు. శ్రావణ శుక్రవారం మొక్కలు నాటడం వల్ల సంపద పెరుగుతుంది. శుక్రవారం రోజుల్లో డబ్బు దానం చేయడం శుభప్రదం. 
 
ఇంకా శ్రావణ శుక్రవారం పంచమి కలిపి రావడంతో.. ఐదు నూనెలను కలగలిపి.. ఆమెకు దీపం వెలిగిస్తే సకలసంపదలు వెల్లివిరుస్తాయి. ఈ దీపానికి ఎరుపు వత్తులను వాడటం మంచిది. నైవేద్యంగా పొట్టు తీయని మినపప్పుతో తయారు చేసిన గారెలు లేకుంటే నవధాన్యాలతో చేసిన గారెలను, పెరుగన్నం, శెనగలు, పానకం వంటివి సమర్పించవచ్చు.  
 
ఇంకా "ఓం శ్రీ పంచమి దేవియే నమః" అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే విశేష ఫలితాలను పొందవచ్చు. ఇంట సుభిక్షానికి కొదవవుండదు. రుణబాధలుండవు. దారద్ర్యం తొలగిపోతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలిని చంపి సూట్‌కేసులో కుక్కి... కాలువలో పడేశాడు...

Mock Assembly in Amaravati: విద్యార్థులతో మాక్ అసెంబ్లీ.. హాజరైన చంద్రబాబు, నారా లోకేష్ (video)

అర్థరాత్రి రాపిడో బ్రేక్ డౌన్... యువతి కంగారు... ఆ కెప్టెన్ ఏం చేశారంటే....

ఓటు హక్కును వినియోగించుకోవడం మన కర్తవ్యం : ప్రధాని నరేంద్ర మోడీ

ఏపీలో మూడు కొత్త జిల్లాలు.. మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం

అన్నీ చూడండి

లేటెస్ట్

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

24-11-2025 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలం.. కార్యసిద్ధిస్తుంది...

23-11-2025 ఆదివారం ఫలితాలు - ఆచితూచి అడుగేయండి.. భేషజాలకు పోవద్దు...

నవంబర్ 26 నుంచి 17 ఫిబ్రవరి 2026 వరకూ శుక్ర మౌఢ్యమి, శుభకార్యాలకు బ్రేక్

సమాధిలోని దీపపు కాంతిలో దేదీప్యమానంగా వీరబ్రహ్మేంద్రస్వామి

తర్వాతి కథనం
Show comments