Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనుమంతునికి ఆవనూనె దీపం.. దానిమ్మ-ఆవుపాలు నైవేద్యంగా పెడితే?

ఆరోగ్యంగా వుండాలంటే.. ఆంజనేయ స్వామిని పూజించాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. 41 రోజుల పాటు మండల దీక్ష చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ 41 రోజులు నిష్ఠతో పూజ చేసి... 41 రోజుల పాటు ఉదయం పూ

Webdunia
బుధవారం, 6 జూన్ 2018 (11:48 IST)
ఆరోగ్యంగా వుండాలంటే.. ఆంజనేయ స్వామిని పూజించాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. 41 రోజుల పాటు మండల దీక్ష చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ 41 రోజులు నిష్ఠతో పూజ చేసి... 41 రోజుల పాటు ఉదయం పూట హనుమంతునికి ఆలయంలో ఆవనూనెతో దీపమెలిగించాలి. ఇలా 41 రోజుల పాటు మండల దీక్ష చేసి.. ముగిసిన తర్వాత హనుమంతునికి అర్చన చేయిస్తే సకల సంపదలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
అలాగే కోరుకున్న కోరికలు నెరవేరాలంటే..? సుందరకాండను పారాయణం చేయాలి. అష్టాదశపురాణాల తర్వాత అందరికీ మార్గనిర్దేశంగా నిలిచేది రామాయణం. ఈ రామాయణంలో వాల్మీకి మహర్షి గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలు తీసుకుని.. అందులో వున్న ఒక్కో అక్షరం మీద వెయ్యి శ్లోకాలను చెప్పారు. ఈ శ్లోకాలు రామాయణంలో మనకు కనబడుతాయి. 
 
అందుకే రామాయణ పఠనం ద్వారా కోరుకున్న కోరికలను నెరవేర్చుకోవచ్చు. ముఖ్యంగా సుందరకాండ పారాయణం ద్వారా కష్టాలు తొలగిపోతాయి. ఆంజనేయ స్వామి ఎన్నో కష్టాలను దాటుకుని, సముద్రాన్ని దాటుకుని సీతమ్మను దర్శనం చేసుకున్నాడు.. సీతమ్మ శోకాన్ని లేకుండా చేశాడు. అదే తరహాలో సుందరకాండను పారాయణం చేసుకున్న వారికి ఈతిబాధలంటూ వుండవు.
 
సుందరకాండను 68 రోజుల పాటు పారాయణం చేస్తే చికాకులు, ఈతిబాధలు, వ్యాపారాల్లో నష్టాలు తొలగిపోతాయి. సుందరకాండను సప్త సర్గీ విధానంలో పారాయణ చేయాలి. అయితే సుందరకాండ పారాయణం చేసే ముందు, పారాయణం చేసిన తర్వాత దానిమ్మ పండును నైవేద్యంగా పెట్టాలి. లేకుంటే ఆవుపాలను నైవేద్యంగా పెట్టాలి. 
 
ఇంకా రామచంద్రమూర్తి అష్టోత్తరాన్ని పారాయణ చేసి, దాని తర్వాత మాత్రమే సుందరకాండను పారాయణ చేయాలి. ఇలా రోజూ 7 సర్గల మేర సుందరకాండను పారాయణ చేస్తే.. సమస్యలు మాయమవుతాయి. అసాధ్యమనుకున్న పనులు కూడా సుసాధ్యమవుతాయని పండితులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నువ్వు చనిపోవాలంటూ భర్త వేధింపులు - నవ వధువు ఆత్మహత్య

Bihar : పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. పొదల్లో ఒకరి తర్వాత ఒకరు..?

Milla Magee: మిల్లా మాగీపై వేధింపులు.. క్షమాపణలు చెప్పిన కేటీఆర్.. ఓ ఆడపిల్ల తండ్రిగా ఇలాంటివి?

Covid: బెంగళూరులో తొలి కోవిడ్ మరణం నమోదు.. యాక్టివ్‌గా 38 కేసులు

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి.. మరొకరి పరిస్థితి విషమం

అన్నీ చూడండి

లేటెస్ట్

23-05-2025 శుక్రవారం దినఫలితాలు - అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు...

22-05-2025 గురువారం దినఫలితాలు - పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది...

Navgraha Shanti Bracelet: నెగటివ్ ఎనర్జీ వద్దే వద్దు... నవగ్రహ శాంతి బ్రాస్లెట్‌ను ధరించండి

సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి సమక్షంలో గంగాధర శాస్త్రి పండిత గోష్ఠి

21-05-2025 బుధవారం దినఫలితాలు - వృధా ఖర్చులు తగ్గించుకుంటారు....

తర్వాతి కథనం
Show comments