Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరాముడు ఆచరించిన ఏకాదశి వ్రతం విశిష్టత... భార్యాభర్తలు అలా..? (video)

Webdunia
బుధవారం, 11 మే 2022 (20:57 IST)
అమావాస్య , పౌర్ణమికి తర్వాత ప్రతి నెలా 11వ రోజు వచ్చే తిథిని ఏకాదశిగా పిలుస్తారు. వీటిని శుక్లపక్ష ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి అని పిలుస్తారు. ఏకాదశితో పాటు ద్వాదశి నాడు పూజ పూర్తయిన తరువాత మాత్రమే పూర్తిగా ఈ వ్రతం ముగుస్తుంది. ఏకాదశి రోజున పూర్తిగా ఉపవసించి.. అల్పాహారం తినాలి. ద్వాదశ పారణతో వ్రతాన్ని పూర్తి చేయాలి. 
 
సాధారణంగా గాయత్రిని మించిన మంత్రం లేదు. ఏకాదశిని మించిన ఉపవాసం లేదు.. అంటారు పెద్దలు. ఏకాదశి ఉపవాసం ఉపవాసాలలో ఉత్తమమైనది.
 
ఈ రోజు ఉపవాసం ఉండి నారాయణ స్వామిని పూజించడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం, ఒక్కపూట మాత్రమే తినడం, తులసి తీర్థం సేవించడం, విష్ణువును ఆరాధించడం వల్ల గొప్ప ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతారు.
 
అలాంటి మహిమాన్వితమైన ఏకాదశి గురువారం (మే 11) రావడం విశేషం. ఈ గురువారం పూట వైశాఖ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథి రోజున శ్రీరాముడే ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లు పురాణాలు చెప్తున్నాయి. సీతమ్మను వీడిన నానా కష్టాలు పడిన రామునితో వశిష్ఠ మహర్షి ఈ వ్రతాన్ని ఆచరించాల్సిందిగా చెప్పినట్లు పురాణాలు చెప్తున్నాయి. 
 
ఈ వ్రతం ఆచరించడం ద్వారానే దశావతారాల్లో ఒకరైన శ్రీరాముడు సీతమ్మతో తిరిగి కలిశాడని విశ్వాసం. అందుచేత ఈ ఏకాదశి రోజున వ్రతమాచరించే దంపతులు అన్యోన్యంగా జీవిస్తారని నమ్మకం. అంతేగాకుండా విడిపోయిన దంపతులు ఈ  ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా జీవితాంతం కలిసి సుఖసంతోషాలతో జీవిస్తారని పండితులు చెప్తున్నారు.
 
ఈ ఏకాదశిని మోహినీ ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల వ్యక్తి పాపాలు నశిస్తాయి. ఒక వ్యక్తి పాపం, బాధల నుండి విముక్తి పొందుతాడు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా గరుడాళ్వార్ అనుగ్రహం లభిస్తుంది. సన్మార్గం సిద్ధిస్తుంది. సుఖసంతోషాలు వెల్లివిరిస్తున్నాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వైకుంఠ ప్రాప్తి చేకూరుతుంది. 

 

 
ఒకవేళ ఈ వ్రతాన్ని ఆచరించడం కుదరని పక్షంలో పెరుమాళ్ల వారి ఆలయాన్ని దర్శించుకోవడం ఉత్తమం. ఏకాదశి సందర్భంగా స్వామి వారికి వస్త్రాన్ని సమర్పించడం.. పూలమాలతో అర్చించడం, తులసీమాలతో పూజించడం వంటివి చేయడం ద్వారా శుభ ఫలితాలను ఆశించవచ్చు అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. 

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

నరదృష్టిని తరిమికొట్టే కంటి దృష్టి గణపతి.. ఉత్తరం వైపు?

24-04-202 బుధవారం దినఫలాలు - విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వల్ల...

తర్వాతి కథనం
Show comments