Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేతు గ్రహ దోషాలను తొలగించే అన్నదమ్ములు.. వాళ్లెవరో తెలుసా?

కేతు గ్రహ దోషాలను తొలగించుకునేందుకు అన్నదమ్ములను పూజించండి.. అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. వాళ్లెవరో కాదు.. విఘ్నాలను తొలగించే వినాయకుడు.

Webdunia
సోమవారం, 15 అక్టోబరు 2018 (16:13 IST)
కేతు గ్రహ దోషాలను తొలగించుకునేందుకు అన్నదమ్ములను పూజించండి.. అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. వాళ్లెవరో కాదు.. విఘ్నాలను తొలగించే వినాయకుడు. అతని సోదరుడైన కుమార స్వామి. వినాయకుడిని పూజించడం వలన కార్యాలు సఫలీకృతం కావడమే కాకుండా, గ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయి. 
 
వినాయకుడిని రోజూ 9 సార్లు ప్రదక్షిణలు చేయడం వలన, కేతుగ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయని పురోహితులు అంటున్నారు. కేతు గ్రహదోషాల నుంచి నివారణ లభించాలంటే మంగళవారం పూట వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఫలితం ఉంటుంది. 
 
కేతుగ్రహ దోషం వలన అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అభివృద్ధిపరంగా అడుగుముందుకు పడకపోవడం ... అందుకు సంబంధించి చేసే పనుల్లో అవమానాలు ఎదురుకావడం జరుగుతూ వుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో గణనాథుడిని పూజించడం ద్వారా కేతు గ్రహాధిపతి శాంతిస్తాడని.. తద్వారా ఈతిబాధలను తగ్గిస్తాడని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.
 
కేతువు మోక్ష కారకుడు. అతని వల్ల దోషం కలిగితే ఈతిబాధలు తప్పవు. కేతువులో తాంత్రికం వంటి ప్రతికూల ప్రభావాలుంటాయి. అదే కేతు గ్రహాన్ని శాంతింప జేసుకుంటే.. మానసిక, శారీరక సామర్థ్యాలు పెరుగుతాయి. ధైర్యం వెన్నంటి వుంటుంది.

అందుకే మంగళవారం పూట నువ్వుల నూనెతో కేతు గ్రహానికి దీపమెలిగించాలి. ఆపై వినాయకుడు, కుమార స్వామికి నేతితో దీపమెలిగించి స్తుతిస్తే కేతు దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Ugadi 2025: ఉగాది రోజు బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేస్తే సర్వశుభం..

26-03-2025 బుధవారం దినఫలితాలు - మీ బలహీనతలు అదుపు ఉంచుకోండి...

నన్ను ప్రేమించి ఆమెను పెళ్లాడుతావా?: శిలగా మారిపోయిన వేంకటేశుడు

25-03-2025 మంగళవారం దినఫలితాలు - పొదుపు పథకాలపై దృష్టి పెడతారు...

AP Govt: అమరావతిలో శ్రీవారి ఆలయం- రూ.185 కోట్లు కేటాయింపు.. అద్భుతంగా నిర్మాణం

తర్వాతి కథనం
Show comments