Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామిక ఏకాదశి 2021: మహావిష్ణువును తులసీ ఆకులతో పూజిస్తే..?

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (11:37 IST)
కామిక ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. ఈ సంవత్సరం కామిక ఏకాదశి ఆగస్టు 04 బుధవారం. కామిక ఏకాదశి రోజున విష్ణుపూజతో పాపాలన్నీ నశిస్తాయి. ఇంకా అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు 
 
ఏకాదశి తిథి ఆగస్టు 03, మంగళవారం మధ్యాహ్నం 12:59 నుండి ప్రారంభమవుతుంది. బుధవారం, 04 ఆగస్టు బుధవారం మధ్యాహ్నం 03:17 గంటలకు ముగుస్తుంది. కామిక ఏకాదశి రోజున, విష్ణుమూర్తి ఆరాధనతో మేలు జరుగుతుంది. ఉపవాసం, జాగరణతో వైకుంఠ ప్రాప్తి సిద్ధిస్తుంది. 
 
కామిక ఏకాదశి అన్ని కోరికలను నెరవేరుస్తుంది. పాపాల నుండి విముక్తి పొందుతుంది. ఈ ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను శ్రీకృష్ణుడు స్వయంగా ధర్మరాజు యుధిష్ఠిరునికి చెప్పాడు. 
 
ఉదయాన్నే లేచి స్నానం చేయండి
దీపారాధాన చేయండి
గంగాజలంతో విష్ణుమూర్తికి అభిషేకం చేయండి.
విష్ణుమూర్తికి పుష్పాలు, తులసి దళాలను సమర్పించండి.
వీలైతే, ఈ రోజు కూడా ఉపవాసం ఉండండి.
 
దేవునికి నైవేద్యంగా రవ్వల పదార్థాలను అర్పించండి. తులసిని తప్పనిసరిగా చేర్చాలి. ఈ పవిత్రమైన రోజున విష్ణువుతో పాటు, లక్ష్మీ దేవిని పూజించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Talakona: తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మెరుగైన సౌకర్యాలు

KPHB : వేశ్యతో గొడవ.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై కత్తితో దాడి

Bus crash: ఆప్ఘనిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు- ట్రక్కు ఢీ.. 71మంది సజీవ దహనం

అన్నయ్యతో చెల్లెలు సంసారం.. ప్రెగ్నెంట్ కావడంతో భర్తకు డౌట్.. ఎందుకోసమంటే?

టీచర్‌ని ప్రేమించిన స్టూడెంట్.. చీర కట్టుకుని వచ్చింది.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు

అన్నీ చూడండి

లేటెస్ట్

ఆదిత్యుడికి ఆరాధన చేస్తే ఫలితాలు ఏమిటో తెలుసా?

Dasara: శ్రీశైలంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా మహోత్సవాలు

TTD: తిరుత్తణి కుమార స్వామికి శ్రీవారి సారె -మంగళ వాద్యం, దరువుల మధ్య..?

వైకుంఠం క్యూ కాంప్లెక్స్-3 కోసం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం.. త్వరలో ప్రారంభం

కాలజ్ఞానం రాస్తున్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని తొలిసారి చూచినదెవరో తెలుసా?

తర్వాతి కథనం
Show comments