సూర్యభగవానుడిని ఇలా పూజిస్తే.. గ్రహదోషాలుండవు..

సూర్య భగవానుడిని రోజూ పూజిస్తే సకల గ్రహ దోషాల నుంచి విముక్తి రావడమే కాకుండా ఆరోగ్యం, ఐశ్వర్యం, మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత రెండు అరచేతుల నిండా నీరు తీసుకుని సూర్యుడి ముం

Webdunia
ఆదివారం, 10 సెప్టెంబరు 2017 (16:57 IST)
సూర్య భగవానుడిని రోజూ పూజిస్తే సకల గ్రహ దోషాల నుంచి విముక్తి రావడమే కాకుండా ఆరోగ్యం, ఐశ్వర్యం, మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత రెండు అరచేతుల నిండా నీరు తీసుకుని సూర్యుడి ముందే అంటే తూర్పు వైపు సూర్యుడు మనకు కనబడేలా నిల్చుని.. నీరుని ''ఓం మిత్రాయ నమః'' అని మూడుసార్లు చెప్తూ మూడుసార్లు వదిలి పెడితే ఎలాంటి గ్రహదోషాలైనా తొలగిపోతాయి. 
 
ఎలాంటి కోరికలైనా కచ్చితంగా నెరవేరుతాయి. నీరు వదిలిన తర్వాత ఎండలో పది నిమిషాల పాటు నమస్కారం చేసుకోవడం ద్వారా ఆరోగ్య పరంగానూ, ఆధ్యాత్మిక పరంగానూ మేలు జరుగుతుంది. గ్రహాలన్నింటిలో అగ్రజుడైన సూర్యుడిని పూజించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది.
 
ఈతిబాధలు తొలగిపోతాయి. స్నానం చేసిన తర్వాత.. శుభ్రమైన దుస్తులు ధరించిన గంటలోపు సూర్యునికి అర్గ్యం ఇవ్వాలి. రాగిచెంబును మాత్రమే అర్గ్యానికి వాడాలి. ఈ నీటిలో పంచదార లేదా తేనె కలిపి ఆ నీటితో  సూర్యునికి అర్గ్య మివ్వాలి. ఆదివారం పూట సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం మంచిది. దీనివలన ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తను చనిపోయినట్లు టీవీలో వస్తున్న వార్తను చూస్తున్న నటుడు ధర్మేంద్ర, ఇంతకన్నా దారుణం ఏముంటుంది?

డాక్టర్ షాహీన్ సిద్ధిఖీ: అద్భుతమైన బోధకురాలు ఉగ్రవాదిగా ఎలా మారిపోయింది?!

నవంబర్ 21లోపు కోర్టుకు హాజరు అవుతాను.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి

పవన్ గారూ.. దీనిని భక్తి అనరు.. రాజకీయ నటన అంటారు.. ఆర్కే రోజా ఫైర్

హైదరాబాదులో విదేశీ మహిళలతో వ్యభిచారం.. స్టూడెంట్ వీసాతో వచ్చి..?

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారి దివ్య ఆశీస్సులతో అన్నప్రసాదానికి ఆధునిక వంటశాల: ముకేష్ అంబాని

Non Veg Food Near Alipiri: అలిపిరి సమీపంలో మాంసాహారం తిన్నారు.. ఇద్దరు ఉద్యోగులు అవుట్

10-11-2025 సోమవారం ఫలితాలు - కొత్త వ్యక్తులతో జాగ్రత్త

09-11-2025 నుంచి 15-11-2025 వరకూ మీ రాశి ఫలితాలు

08-11-20 శనివారం ఫలితాలు - మీ కష్టం మరొకరికి లాభిస్తుంది

తర్వాతి కథనం
Show comments