Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవునెయ్యి మాత్రమే పూజకు శ్రేష్ఠం.. గేదె నెయ్యితో మాత్రం..?

Webdunia
సోమవారం, 15 డిశెంబరు 2014 (18:41 IST)
శుభకార్యాల్లోనూ, క్షేత్రాల్లోనూ ఆవునెయ్యిని ఉపయోగించడమనేది ప్రాచీనకాలం నుంచి ఆచారంగా వస్తున్న సంగతి తెలిసిందే. దైవకార్యాలకి సంబంధించిన యజ్ఞయాగాది కార్యక్రమాలలోనూ, దోష నివారణార్థం చేసే శాంతి హోమాలలోను ఆవునెయ్యి తప్పనిసరిగా వాడుతుంటారు. అలాగే దేవతలకి నివేదన చేసే వివిధరకాల పదార్థాలలోను ఆవునెయ్యినే ఉపయోగిస్తుంటారు. 
 
దేవాలయాలకి సంబంధించిన విషయాల్లోనే కాదు, ఇంటికి సంబంధించిన పూజా కార్యక్రమాల్లోనూ ఆవునెయ్యిని ఉపయోగించడమే శ్రేష్టం. దీపారాధనకు నైవేద్యాలకు తప్పనిసరిగా ఆవునెయ్యినే వినియోగించాలని పండితులు అంటున్నారు. అయితే గేదెనెయ్యిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శుభకార్యాలకు ఉపయోగించకూడదు. ఈ విధంగా చేయడం వలన అనేక దోషాలు అక్కున చేరతాయని శాస్త్రం చెబుతోంది. 
 
గేదె నెయ్యితో దీపారాధన చేయడం వలన, నైవేద్యాలు తయారు చేయడం వలన నీచమైన జంతుజన్మలు కలుగుతాయని అంటోంది. అందువలన పుణ్యఫలాలను ఆశించి చేసే దైవకార్యాలలో పాపాలను కొనితెచ్చే పనులు జరగకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా వుందని పురోహితులు అంటున్నారు.

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

Show comments