Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యంగా వుండాలంటే.. ధన్వంతరి పూజ చేయాలట..?

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (11:34 IST)
ఆరోగ్యంగా వుండాలంటే.. ధన్వంతరి పూజ చేయాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. రోగాలను దూరం చేసుకోవాలంటే.. ధన్వంతరి భగవానుడిని పూజించాలని చెప్తున్నారు. పురాణాల్లో దేవతలు, రాక్షసులు పాల సముద్రంలో చిలికిన సందర్భంగా అమృతం బయటపడింది. ఈ పాల సముద్రం చిలికినపుడు చివరిగా ధన్వంతరి భగవానుడు ఉద్భవించినట్లు పురాణాలు చెప్తున్నాయి. 
 
ఇదే పాల సముద్రం నుంచి వ్యాధులను నివారించే వైద్య మూలికలను కనుగొన్నారు. వ్యాధులను నివారించి.. ఆరోగ్యాన్ని రక్షించే వైద్య మూలికలతో ఉద్భవించిన ధన్వంతరి భగవానుడిని పూజిస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. 
 
ధన్వంతరిని త్రయోదశి తిథిలో పూజిస్తే ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడు. త్రయోదశి రోజున ధన్వంతరిని తలచి ఉపవసించి.. పూజ చేసి.. తగినంత వస్త్రదానం చేయాలి. ఇంకా త్రయోదశి తిథి రోజున యమాష్టక స్తుతి చేయడం ద్వారా ప్రాణాంతక వ్యాధులు నయం అవుతాయి. ఇంకా అకాల మరణాలు, దుర్మరణాలు వుండవు. ధన్వంతరి పూజతో యమదేవుని అనుగ్రహం కూడా చేకూరుతుందని విశ్వాసం.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రిన్సిపాల్ గదిలోనే దళిత బాలికపై అత్యాచారం.. ఆన్‌‌లైన్‌లో వీడియో

Snakes: ఆ చెట్టు నిండా పాములే.. కొమ్మకు కొమ్మకు కొండ చిలువలు

ప్రియుడు కారులో వెళుతున్న భార్య.. ప్రియుడితో బొట్టు పెట్టించిన భర్త!

Jagan: విజయసాయి రెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. పూర్తిగా లొంగిపోయారు

'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌ను మోకాళ్లపై నిలబెట్టాం : ప్రధాని మోడీ

అన్నీ చూడండి

లేటెస్ట్

సుదర్శన చక్ర మహిమ: సుదర్శన చక్ర మంత్ర శక్తి తెలుసా?

19-05-2025 సోమవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

18-05-2025 నుంచి 24-05-2025 వరకు వార రాశి ఫలితాలు

18-05-2025 శనివారం దినఫలితాలు - తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు...

బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

తర్వాతి కథనం
Show comments