Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆషాఢంలో గోరింటాకు..? పుట్టినింట భార్య మెట్టినింట వున్న భర్త కోసం..?

Webdunia
బుధవారం, 17 జులై 2019 (13:34 IST)
గోరింటాకు ఆషాఢంలో పెట్టుకోవడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. ఆషాఢంలో కొత్త పెళ్లి కూతురు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీ. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే.. గోరింటాకు.. వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. 
 
ఆషాఢ మాసంలో పుట్టింట వుండే మహిళలు గోరింటాకు పెట్టుకుంటే మెట్టినింట వుండే భర్త ఆరోగ్యాన్ని ఆకాంక్షించినట్లు అవుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. వేళ్లకి గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోళ్లు పెళుసుబారిపోకుండా, గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
 
గోరింటాకు మన శరీరానికి తాకితే.. అందులో లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫసంబంధమైన వ్యాధులు ఏర్పడతాయి. 
 
గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. అందుకే ఆషాఢంలో గోరింటాకు వాడాలని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వృద్ధుడికి ఆశ చూపిన మహిళ.. రూ. 8.7 కోట్లు కొట్టేశారు.. చివరికి ఏం జరిగిందంటే?

Bengal: పట్టపగలే హత్య.. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి కుమారుడిని కాల్చి చంపేశారు

తిరుమలలో ఆసక్తికర దృశ్యం.. అనుకోకుండా ఎదురుపడిన రోజా, నారాయణ (వీడియో)

వేడి వేడి మిర్చి బజ్జీ ప్రాణం తీసేసింది

Jagan: జగన్ రాఖీ శుభాకాంక్షలు.. ట్రోల్స్ మొదలు- దోచుకున్న దాన్ని దాచడానికి పోరాటం

అన్నీ చూడండి

లేటెస్ట్

08-08-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య నుంచి గట్టెక్కుతారు...

Raksha Bandhan 2025: రాఖీ పండుగ రోజున అరుదైన మహా సంయోగం.. ఏ టైమ్‌లో రాఖీ కట్టాలి?

శ్రావణ వరలక్ష్మి వ్రతం, పూజ విధానం

Varalakshmi Vratam 2025: బ్రహ్మ ముహూర్తంలో వరలక్ష్మీ వ్రతం చేస్తే సర్వం శుభం

Raksha Bandhan: రక్షాబంధన్ రోజున సోదరికి ఈ బహుమతి ఇస్తే.. అదృష్టం ఖాయం

తర్వాతి కథనం
Show comments