Webdunia - Bharat's app for daily news and videos

Install App

పందిళ్లపల్లి ధ్వజస్తంభం ఒరగడం.. అరిష్టానికి సంకేతమా..?

Webdunia
FILE
సుప్రసిద్ధ శ్రీ కాళహస్తీశ్వరాలయ రాజగోపురం కూలిన కొద్ది రోజుల్లోనే పందిళ్లపల్లి ధ్వజస్తంభం ఒరిగింది. నాలుగు శతాబ్ధాల చరిత్ర కలిగిన పందిళ్లపల్లి దేవస్థానంలోని ధ్వజస్తంభం శుక్రవారం రాత్రి వీచిన ఈదురు గాలుల ధాటికి ధ్వజస్తంభం ఒరిగి, దేవస్థానంపైనే పడింది. ఏడుదశాబ్ధాల కాలంలో పందిళ్లపల్లి ధ్వజస్తంభం నేలకొరగడం ఇది రెండోసారి.

శుక్రవారం అర్థరాత్రికి తర్వాత వీచిన ఈదురు గాలుల ధాటికి ధ్వజస్తంభం ఒరగడం అరిష్టానికి సంకేతమేనని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే శ్రీకాళహస్తీశ్వరాల రాజగోపురం కూలిపోవడంతో రాష్ట్రంలో పలు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పురోహితులు హెచ్చరిస్తున్న తరుణంలో పందిళ్లపల్లి ధ్వజస్తంభం నేలకొరగడం భక్తులను మరింత ఆవేదనకు గురిచేసింది.

మరోవైపు.. ధ్వజస్తంభంలోని కొయ్యభాగం పూర్తిగా పాడైపోవడం, నిర్వాహ లోపమే పందిళ్లపల్లి ధ్వజస్తంభం కూలిపోవడానికి కారణమని స్థానిక ప్రజలు అంటున్నారు. కానీ పండితులు మాత్రం ఇది అరిష్టానికి సంకేతమని హెచ్చరిస్తున్నారు.

శుక్రవారం పూట ధ్వజస్తంభం నేలకొరగడం అశుభమని పురోహితులు హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు శివ, విష్ణువులను శ్రద్ధగా పూజించడం ద్వారా అశుభ ఫలితాల నుంచి రాష్ట్ర ప్రజలు గట్టెక్కే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

Show comments