రాలిపోయిన బెంగాలీ స్టార్ సుచిత్రా సేన్... ముఖం చూపించి 30 ఏళ్లు...ఎందుకని?

Webdunia
శుక్రవారం, 17 జనవరి 2014 (18:20 IST)
PTI
బెంగాలీ తార సుచిత్రా సేన్ ఆనాటితరం ప్రేక్షకులకు కలలరాణి. ఆమె హీరోయిన్‌గా నటిస్తూ సినిమా వచ్చిందంటే కాసుల పంట కురుసేది. ఐతే ఆమె గత 3 దశాబ్దాలుగా బయటి ప్రపంచానికి దూరంగా కాలం వెళ్లబుచ్చారు. ముఖ్యంగా ఆమె 1978లో నటించిన 'ప్రొనొయ్ పాషా' అనే చిత్రం అపజయం అయిన తర్వాత సుచిత్రా సేన్ బాహ్య ప్రపంచానికి దూరంగా జరిగారు. ఈ కాలంలో ఆమెకు ఎంతో ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినా దానిని అందుకునేందుకు తిరస్కరించారు.

ఏదో ఒక ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ కు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ తన రూపాన్ని బయటి ప్రపంచానికి చూపించేందుకు ఆమె ఇష్టపడలేదు. అలా బయటి ప్రపంచానికి రాకపోవడం వెనుక కారణం ఏమిటన్నది మిస్టరీగా మారింది. మరణించిన తర్వాత కూడా ఆమె భౌతికకాయాన్ని చూసేందుకు వచ్చిన అభిమానులకు నిరాశే ఎదురయ్యింది.

ఆమె మృతదేహాన్ని నల్లటి అద్దాల మధ్య ఉంచి, పైన అంతా పూలతో కప్పివేయబడింది. ఐతే అభిమానులు పెద్ద పెట్టున సుచిత్రను చివరిసారిగా చూడాలని కోరినప్పుడు, తన మరణం తర్వాత తన ముఖాన్ని ఎవరికీ చూపించవద్దని ఆమె తమ వద్ద వాగ్దానం తీసుకున్నారనీ, అందువల్ల తాము చూపించలేమని చెప్పారు కుటుంబసభ్యులు.

మొత్తానికి ఎందరో గుండెల్లో కలల రాణిగా నిద్రపోయిన సుచిత్రాసేన్, ఆనాటి చెదరని సౌందర్యరాశిగానే గుర్తిండిపోయారు. అలానే ఈ లోకం నుంచి దూరంగా వెళ్లిపోయారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

శెభాష్ నాయుడు... క్లిష్ట సమయంలో మీ పనితీరు సూపర్ : ప్రధాని మోడీ కితాబు

ఆహా... ఏం రుచి... అమెరికాలో భారతీయ వంటకాలకు ఆదరణ

Davos: జనవరి 19 నుంచి జనవరి 23 వరకు చంద్రబాబు దావోస్ పర్యటన

మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్లను వద్దనే వద్దంటున్న కంపెనీ

తల్లి కళ్ళెదుటే ఇంటర్ విద్యార్థినిని గొంతు కోసి చంపేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

Show comments