మలేషియాలో భారతీయ మహిళ మృతి

Webdunia
మలేషియాలో తన నలుగురు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ భారతీయ మహిళ మరణించింది. దొంగతనానికి పాల్పడ్డాడనే నెపంతో తన సోదరుడిని పోలీసులు కాల్చి చంపటంతో.. కలత చెందిన ఆర్. సీత అనే భారత మహిళ తన పిల్లలకు పురుగుల మందిచ్చి, తానూ తాగింది.

అయితే సీతను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. గత ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడిన ఆమె మరణించగా.. పిల్లలు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న అక్కడి హిందూ రైట్స్ యాక్షన్ ఫోరమ్ (హిండ్రాఫ్) నేత పీ. ఉదయ కుమార్, ప్రతిపక్ష ఎంపీలు మాణిక్య వాసంగం, మనోహరన్‌లు... సీత మృతదేహంతో పార్లమెంట్ ముందు ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు.

ఇదిలా ఉంటే.. సీత సోదరుడు సురేంతిరాన్ (24)తో సహా ఐదుగురు భారతీయులను, దొంగతనానికి పాల్పడ్డారనే ఆరోపణలతో నవంబర్ నెల మొదట్లో మలేషియా పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటనపై స్థానిక ప్రవాస భారతీయ రాజకీయ పార్టీలు, మానవ హక్కుల సంఘాలు అభ్యంతరం తెలియజేస్తూ... తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తీరం దాటిన తుఫాను : ఏపీలో కుండపోతవర్షాలు ... పునరావాస కేంద్రాల్లో 75 వేల మంది

అంతర్వేదిపాలెంలో తీరాన్ని తాకిన మొంథా తుఫాను

Montha Effect: ఈ టైంలో బీచుల దగ్గర వీడియోస్ చేసుకోవడం కరెక్ట్ కాదు.. నారా లోకేష్

చంద్రబాబు గ్రేట్.. హరీష్ రావు తండ్రి పట్ల సంతాపం.. మొంథా పనులు ఒకవైపు జరుగుతున్నా?

ఏపీపై మొంథా తుఫాను తీవ్ర ప్రభావం : బాబు - పవన్ ఉన్నతస్థాయి సమీక్ష

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

Show comments