Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలేషియాలో పెరుగుతున్న భారత మహిళల "విడాకులు"

Webdunia
FILE
మలేషియాలో విడాకులు తీసుకునే భారతీయ మహిళల సంఖ్య పెరుగుతోందనీ, ముఖ్యంగా ఉద్యోగాలు చేయని భర్తలను వదిలేసేందుకు వారు ఏ మాత్రం వెనుకాడటం లేదని.. స్థానిక తమిళ పత్రిక ఒకటి వెల్లడించింది. ముఖ్యంగా జోహార్ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నట్లు ఆ పత్రిక పేర్కొంది.

ఇంతకుమునుపు భార్యల నుంచి విడిపోయేందుకు భర్తలు న్యాయస్థానాలను ఆశ్రయించేవారనీ, అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయిందనీ.. భర్తల నుంచి విడిపోయేందుకు భారత మహిళలు ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని "మలేషియా నన్‌బన్" పత్రిక తెలిపింది. "గందరగోళ ధోరణి" అనే పేరుతో ప్రచురించిన ఈ వార్తా కథనంలో.. సింగపూర్‌లో ఉద్యోగాలు చేస్తున్న భారత మహిళల్లో 80 శాతంమంది విడాకుల కోసం ఎదురుచూస్తున్నారన్న విషయాన్ని అందులో ఉటంకించింది.

ఇదిలా ఉంటే.. భర్తల నుంచి ఎందుకు విడిపోవాలనుకుంటున్నారో చెప్పేందుకు చాలామంది మహిళలు నిరాకరించినట్లు ఆ పత్రిక పేర్కొంది. ఏ పనీ చేయకుండా భార్యల జీతంపై ఆధారపడుతున్నందువల్లనే ఎక్కువమంది వివాహితలు విడాకులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా.. పెళ్లయిన ఆరు నెలల నుంచి పది సంవత్సరాల లోపు జంటలు ఇలా అధికంగా విడిపోతున్నవారిలో ఉన్నట్లు ఆ పత్రికా కథనం వివరించింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

IMD: హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 6న అతి భారీ వర్షపాతం- రెడ్ అలెర్ట్ జారీ

ఫ్లైఓవర్‌పై ఫోటో షూట్ పేరుతో యువకులు హల్ చల్- డ్రోన్ కనిపించడంతో పరుగులు (video)

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

రూ.1 కోటి విలువైన 1,000 దొంగలించబడిన మొబైల్ ఫోన్లు స్వాధీనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

Show comments