మలేషియాలో పెరుగుతున్న భారత మహిళల "విడాకులు"

Webdunia
FILE
మలేషియాలో విడాకులు తీసుకునే భారతీయ మహిళల సంఖ్య పెరుగుతోందనీ, ముఖ్యంగా ఉద్యోగాలు చేయని భర్తలను వదిలేసేందుకు వారు ఏ మాత్రం వెనుకాడటం లేదని.. స్థానిక తమిళ పత్రిక ఒకటి వెల్లడించింది. ముఖ్యంగా జోహార్ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నట్లు ఆ పత్రిక పేర్కొంది.

ఇంతకుమునుపు భార్యల నుంచి విడిపోయేందుకు భర్తలు న్యాయస్థానాలను ఆశ్రయించేవారనీ, అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయిందనీ.. భర్తల నుంచి విడిపోయేందుకు భారత మహిళలు ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని "మలేషియా నన్‌బన్" పత్రిక తెలిపింది. "గందరగోళ ధోరణి" అనే పేరుతో ప్రచురించిన ఈ వార్తా కథనంలో.. సింగపూర్‌లో ఉద్యోగాలు చేస్తున్న భారత మహిళల్లో 80 శాతంమంది విడాకుల కోసం ఎదురుచూస్తున్నారన్న విషయాన్ని అందులో ఉటంకించింది.

ఇదిలా ఉంటే.. భర్తల నుంచి ఎందుకు విడిపోవాలనుకుంటున్నారో చెప్పేందుకు చాలామంది మహిళలు నిరాకరించినట్లు ఆ పత్రిక పేర్కొంది. ఏ పనీ చేయకుండా భార్యల జీతంపై ఆధారపడుతున్నందువల్లనే ఎక్కువమంది వివాహితలు విడాకులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా.. పెళ్లయిన ఆరు నెలల నుంచి పది సంవత్సరాల లోపు జంటలు ఇలా అధికంగా విడిపోతున్నవారిలో ఉన్నట్లు ఆ పత్రికా కథనం వివరించింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గోవా నైట్ క్లబ్ ఫైర్ .. ఆ తప్పే ప్రాణాలు హరించాయా? మృతుల్లో 20 మంది స్టాఫ్

ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ - ఈ పవిత్ర భూమిలో అడుగుపెట్టడం... (వీడియో)

గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి

ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూ పేరును ప్రకటించాలి : నవజ్యోతి కౌర్ సిద్ధూ

సింహాచలంలో విరాట్ కోహ్లీ సందడి.. సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

Show comments