Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్‌లో రాష్ట్రపతికి ఎన్నారైల ఆత్మీయ "విందు"

Webdunia
FILE
భారత రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా దేవీసింగ్ పాటిల్ గౌరవార్థం.. బ్రిటన్‌లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు ఘనంగా ఓ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భారత హై కమీషనర్ లలిత్ సూరి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ విందులో పలువురు ప్రవాస భారతీయ ప్రముఖులు, వ్యాపారులు, మేధావులూ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి నోబెల్ బహుమతి గ్రహీత వి. రామకృష్ణన్‌ను అభినందించారు.

ఈ సందర్భంగా పాటిల్ మాట్లాడుతూ.. విదేశాలలో నివసిస్తున్న ప్రవాస భారతీయులంతా భారతదేశ ఆర్థికాభివృద్ధికి సహకరిస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లు, అవసరాల గురించి మిగిలిన వారికంటే, మీకే బాగా తెలుసునని.. కాబట్టి దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ వారి, వారి స్థాయిల్లో కృషి చేయాలని రాష్ట్రపతి ఎన్నారైలకు పిలుపునిచ్చారు.

ఇదిలా ఉంటే.. మారియట్ ఐదు నక్షత్రాల హోటల్‌లో జరిగిన ఈ విందు సమావేశానికి ప్రముఖ పారిశ్రామికవేత్తలు లార్డ్ స్వరాజ్‌పాల్, ఎస్‌పీ హిందూజా, నాథ్‌ పూరీ, బెంబ్లే హోటల్ యజమాని జోగిందర్ సంగర్, కర్రీ కింగ్ గులామ్ నూన్‌లు.. నోబెల్ గ్రహీత వి. రామకృష్ణన్, కేంద్ర మంత్రి శ్రీమతి పురంధరీశ్వరి తదితరులు హాజరయ్యారు.

కాగా... విందు అనంతరం ప్రతిభా పాటిల్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. జాతిపిత మహాత్మాగాంధీ వస్తువులను ఎంతో గౌరవంగా భారత్‌కు తీసుకెళ్తామని చెప్పారు. స్వదేశానికి వెళ్లిన తరువాత వాటిని ఎక్కడ ఉంచేదీ నిర్ణయిస్తామని ఆమె స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. మహాత్ముడు రాసిన కొన్ని అరుదైన లేఖలను, స్వయంగా ఆయన నేసిన ఖాదీ వస్త్రాన్ని బ్రిటన్ ఎన్నారైలు సేకరించి, రాష్ట్రపతికి బహూకరించనున్న సంగతి తెలిసిందే..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

Show comments