పూజారుల భద్రతకు నేపాల్ హామీ : నిరుపమారావు

Webdunia
FILE
నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయంలో పనిచేస్తున్న భారత పూజారుల భద్రతకు, ఆ దేశ ప్రభుత్వం గట్టి హామీని ఇచ్చిందని.. భారత విదేశాంగ శాఖా కార్యదర్శి నిరుపమారావు వెల్లడించారు. రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం నేపాల్ వెళ్లిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పై విధంగా స్పందించారు.

ఇదిలా ఉంటే.. పదిహేను రోజుల క్రితం నేపాల్‌లోని పశుపతినాథ్ దేవాలయంలో పనిచేస్తున్న భారత పూజారులపై నేపాల్ మావోయిస్టు కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ పర్యటిస్తున్న నిరుపమారావు ముందుగా ఆలయంలో పూజలు నిర్వహించారు.

అనంతరం.. "పశుపతి ఏరియా డెవలప్‌మెంట్ ట్రస్ట్" అధికారులను కలిసిన నిరుపమారావు దాడి ఘటనా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై ప్రభుత్వ అధికారులతో చర్చించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. దాడి ఘటనపై నేపాల్ ప్రభుత్వం విచారం వ్యక్తం చేయటంతోపాటు, భారత పూజారుల భద్రతకు సంబంధించి అన్నిరకాల చర్యలను తీసుకుంటామని చెప్పినట్లు తెలియజేశారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రిసెప్షనిస్టును బలవంతంగా కౌగలించుకుని ముద్దు పెట్టిన నగల వ్యాపారి కొడుకు

Nara Bhuwaneshwari: ఉచిత బస్సు సేవలు.. ఆర్టీసీలో ప్రయాణించిన నారా భువనేశ్వరి (video)

పెళ్లి వేడుకకు వేదికైన ఐసీయూ వార్డు... ఎక్కడ?

ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచిన గంజాయి బానిస, ఎక్కడ?

దుబాయ్ ఎయిర్‌షోలో ప్రమాదం... కుప్పకూలిన తేజస్ యుద్ధ విమానం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

Show comments