Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలేషియాలో భారతీయ మహిళ మృతి

Webdunia
మలేషియాలో తన నలుగురు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ భారతీయ మహిళ మరణించింది. దొంగతనానికి పాల్పడ్డాడనే నెపంతో తన సోదరుడిని పోలీసులు కాల్చి చంపటంతో.. కలత చెందిన ఆర్. సీత అనే భారత మహిళ తన పిల్లలకు పురుగుల మందిచ్చి, తానూ తాగింది.

అయితే సీతను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. గత ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడిన ఆమె మరణించగా.. పిల్లలు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న అక్కడి హిందూ రైట్స్ యాక్షన్ ఫోరమ్ (హిండ్రాఫ్) నేత పీ. ఉదయ కుమార్, ప్రతిపక్ష ఎంపీలు మాణిక్య వాసంగం, మనోహరన్‌లు... సీత మృతదేహంతో పార్లమెంట్ ముందు ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు.

ఇదిలా ఉంటే.. సీత సోదరుడు సురేంతిరాన్ (24)తో సహా ఐదుగురు భారతీయులను, దొంగతనానికి పాల్పడ్డారనే ఆరోపణలతో నవంబర్ నెల మొదట్లో మలేషియా పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటనపై స్థానిక ప్రవాస భారతీయ రాజకీయ పార్టీలు, మానవ హక్కుల సంఘాలు అభ్యంతరం తెలియజేస్తూ... తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments