Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్, సైప్రస్ పర్యటన మరపురానిది : ప్రతిభ

Webdunia
FILE
బ్రిటన్, సైప్రస్ దేశాల ఏడు రోజుల పర్యటనను విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి తిరిగివచ్చిన భారత రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్.. ఆ రెండు దేశాల పర్యటన మరపురానిదని సంతోషం వ్యక్తం చేశారు. ఆదివారం న్యూఢిల్లీ చేరుకున్న రాష్ట్రపతి...మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఇండియా హౌస్‌లో జరిగిన విందును తాను మరచిపోలేనని, అలాగే మన మిత్రదేశమైన సైప్రస్‌ ఆతిథ్యం కూడా అమోఘమని అభివర్ణించారు.

ఇండియా హౌస్‌లో జరిగిన విందు కార్యక్రమంలోనే.. భారత జాతిపిత మహాత్మాగాంధీకి చెందిన వస్తువులను ప్రవాస భారతీయులు సర్ గులామ్ కె. నూన్, నాథుపూరి తనకు అందించారని ప్రతిభ వివరించారు. ఎంతో విలువైన ఆ వస్తువులను ఇప్పుడు భారత్‌కు తీసుకొస్తున్నామని అన్నారు.

ఐటీ నిపుణులతో సహా భారతీయులు అడ్డంకులు లేకుండా బ్రిటన్ వెళ్లేందుకు సంబంధించిన అంశాలు, రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు.. తదితర అంశాలకు సంబంధించి ఆ దేశ ప్రధానమంత్రి గార్డెన్ బ్రౌన్‌తో విస్తృతంగా చర్చించినట్లు రాష్ట్రపతి తెలియజేశారు. అలాగే సైప్రస్ భారత్‌కు సన్నిహిత మిత్రదేశమని వివరించారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments